నైట్ డ్యూటీ చేస్తున్న ఓ పోలీసు అధికారి పాన్ షాప్ ముందటి బల్బ్ దొంగిలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకుంది. వీడియో వైరల్ కావడంలో పై అధికారి ఆ వీడియోలోని పోలీసుపై యాక్షన్ తీసుకున్నారు. 

న్యూఢిల్లీ: నైట్ డ్యూటీ చేస్తున్న ఓ పోలీసు అధికారి వీధులు తిరుగుతూ దొంగలను పట్టుకోవాల్సిన పని వదిలి స్వయంగా దొంగతనం చేశాడు. రాత్రిపూట ఓ పాన్ షాప్ ముందుకు అటూ ఇటూ చూస్తూ వచ్చి.. మెల్లగా ఎదురుగా ఉన్న లైట్ బల్బ్‌ను తీసి జేబులో పెట్టుకుని జారుకున్నాడు. ఉదయం వచ్చిన పాన్ షాప్ ఓనర్‌కు ఆ లైట్ బల్బ్ కనిపించలేదు. సీసీటీవీ పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఆ దొంగా పోలీసు కథ బట్టబయలైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గతవారం అంటే అక్టోబర్ 6వ తేదీన చోటుచేసుకుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ప్రయాగ్ రాజ్ ఫూల్పూర్ ఏరియాలో నైట్ డ్యూటీలో వచ్చిన ఇన్‌స్పెక్టర్ రాజేశ్ వర్మనే ఈ పని చేసినట్టు అధికారులు గుర్తించారు. ఆ అధికారిపై యాక్షన్ తీసుకున్నారు. ఇన్‌స్పెక్టర్ రాజేశ్ వర్మ ఫూల్పూర్ కొత్వాలీ స్టేషన్‌లో పోస్ట్ అయ్యారు. ఈ చోరీ వీడియో వైరల్ అయిన తర్వాత ఎస్ఎస్‌పీ ఆయనను సస్పెండ్ చేశారు. అలాగే, పోలీస్ లైన్‌కు అసైన్ చేశారు. రాజేశ్ శర్మ ఇటీవలే ప్రమోషన్ పొందారు. ఎనిమిది నెలల క్రితమే ఫూల్పూర్ పోలీసు స్టేషన్‌లో అసైన్ చేశారు. 

Scroll to load tweet…

ఇదిలా ఉండగా, సస్పెండ్ అయిన పోలీసు ఇన్‌స్పెక్టర్ రాజేశ్ వర్మ తన చర్యను సమర్థించుకున్నారు. తాను ఆ బల్బ్ తొలగించి తాను విధులు నిర్వహిస్తున్న చోట చీకటిగా ఉన్నదని అక్కడ పెట్టినట్టు వివరించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయనపై శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశాలు వచ్చాయి.