Srinagar: జమ్మూకాశ్మీర్ లో మళ్లీ ఉగ్రకదలికలు కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రమత్తమైన భద్రతా బలగాల బృందాలు ఏడు జిల్లాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. జమ్మూకాశ్మీర్ లోని ఏడు జిల్లాల్లోని 15 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
NIA Conducts Searches In Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ లో మళ్లీ ఉగ్రకదలికలు కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రమత్తమైన భద్రతా బలగాలు ఏడు జిల్లాల్లో సోదాలు నిర్వహిస్తోంది. జమ్మూకాశ్మీర్ లోని ఏడు జిల్లాల్లోని 15 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
వివరాల్లోకెళ్తే.. జమ్మూకాశ్మీర్ లోని ఏడు జిల్లాల్లోని 15 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శనివారం సోదాలు నిర్వహించింది. శ్రీనగర్, పుల్వామా, అవంతిపొరా, అనంతనాగ్, షోపియాన్, పూంచ్, కుప్వారాలో రెండు ఉగ్రవాద సంబంధిత కేసులకు సంబంధించి గాలింపు చర్యలు చేపట్టినట్లు ఏఎన్ఐ వర్గాలు తెలిపాయి.
ఇదిలావుండగా, ప్రత్యేక దర్యాప్తు విభాగం (ఎస్ఐయూ) బుధవారం అవంతిపొరా రేషిపోరా ట్రాల్ లోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. త్రాల్ పోలీస్ స్టేషన్ కేసుకు సంబంధించి ఎస్ఐయూ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. మంజూర్ అహ్మద్ వనీ, మౌహ్సిన్ అహ్మద్ లోన్, అరియాఫ్ బషీర్ భట్ అనే ముగ్గురు అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
ఈ తనిఖీల్లో కీలక సామగ్రిని ఎస్ఐయూ అవంతిపొర బృందాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాద సంబంధిత నేరాల్లో ముగ్గురు అనుమానితుల ప్రమేయం గురించి మరింత తెలుసుకోవడానికి ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మే 12న రాష్ట్ర దర్యాప్తు విభాగం రాంబన్ జిల్లా పోలీసులతో కలిసి జమ్మూకాశ్మీర్ లోని బనిహాల్ సబ్ డివిజన్ బనిహాల్ పరిధిలోకి వచ్చే బనిహాల్, రామ్సూ ప్రాంతాల్లోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. జమ్మూకాశ్మీర్ లో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేందుకు నిరంతరం ప్రయత్నించే అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపే ప్రయత్నాల్లో భాగంగా ఈ దాడులు నిర్వహించినట్లు ఏఎన్ఐ తెలిపింది.