బీహార్ లో ప్రారంభం కాకముందే కుప్పకూలిన వంతెన .. రూ. 14 కోట్లు నీటిపాలు
బీహార్ లోని షాహెబ్పూర్ కమల్ బ్లాక్ సమీపంలోని విష్ణుపూర్ అహోక్ గండక్ ఘాట్ వద్ద నిర్మించిన వంతెన ఆదివారం కూలిపోయింది. దాదాపు 206 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉన్న ఈ వంతెన నిర్మాణానికి 14 కోట్లు ఖర్చు చేసినట్లు అందిన సమాచారం.
బీహార్ ప్రభుత్వ వ్యవస్థలోని అవినీతి వెలుగులోకి వచ్చింది. అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయట పడింది. ప్రారంభం కాకమునుపే ఓ వంతెన కుప్పకూలింది. దాదాపు రూ.13 కోట్ల ప్రజ ధనం నీటి పాలయ్యాయి. ఈ ఘటన బెగుసరాయి జిల్లాలోని సాహెబ్పూర్ కమల్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. బెగుసరాయి జిల్లాలో గండక్ నదిపై ముఖ్యమంత్రి నాబార్డు పథకం కింద విష్ణుపూర్ అహోక్ , సాహెబ్పూర్ కమల్లను కలిపేందుకు 206 మీటర్లు పొడవు ఉన్న 'హై-లెవల్ RCC వంతెన'ను నిర్మించారు.
ఈ వంతెన నిర్మాణం కోసం 13.43 కోట్లు వెచ్చించారు. ఫిబ్రవరి 2016 లో ప్రారంభమైన ఈ వంతెన నిర్మాణ పనులు ఆగస్టు 2017లో పూర్తయ్యాయి. ఈ వంతెన సహాయంతో బెగుసరాయ్ జిల్లాలోని బఖ్రీ, గర్హ్పురా , ముంగేర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల ప్రజలు అలాగే ఖగారియా జిల్లా ప్రజల ప్రయాణానికి ఉపయుక్తంగా ఉండేది.
అయితే అప్రోచ్ రోడ్ పనులు ఇంకా చేపట్టకపోవడంతో వంతెనను ప్రారంభించలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వంతెనకు పగుళ్లు వచ్చాయి. ఈ విషయాన్ని గుర్తించిన స్థానిక అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఇంతలోనే అది కూలిపోయింది. వార్తా సంస్థ ANI ప్రకారం.. వంతెన కొన్ని రోజుల క్రితం పగుళ్లు ఏర్పడింది. 2, 3 పిల్లర్ల మధ్య వంతెన ముందు భాగం ఆదివారం కూలిపోయింది. గత నెలలో నలందా జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలడంతో ఓ కూలీ మరణించాడు.