‘న్యూ ఇయర్ గిఫ్ట్’.. అని పోతున్న పామును పట్టుకుని విన్యాసాలు.. కాటు వేయడంతో...
కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా పాముతో సంబరాలు చేసుకోబోయాడు ఓ వ్యక్తి. దీంతో అది కాటేయడంతో మృత్యువాత పడ్డాడు.
తమిళనాడు : తమిళనాడులో కొత్త సంవత్సరం వేడుకలు విషాదాన్ని నింపాయి. డిసెంబర్ 31 రాత్రి తమిళనాడులోని కడలూరులో విషాద ఘటన జరిగింది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా.. ఓ వ్యక్తి పామును పట్టుకుని.. మెడలో వేసుకుని సంబరాల్లో పాల్గొన్నాడు. అయితే, పాముకేం తెలుసు అది కొత్త సంవత్సరం.. సంబరాలు చేసుకుంటున్నారని.. దీంతో అది పామును పట్టుకున్న వ్యక్తిని, మరొకరిని కసితీరా కాటేసింది.
దీంతో ఒకరు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చేరారు. విషయం ఏంటంటే.. అందరిలాగే మణికందన్ అలియాస్ పప్పు అనే వ్యక్తి కూడా డిసెంబర్ 31 ఫుల్ జోష్ గా జరుపుకున్నాడు. ఫూటుగా మద్యం సేవించాడు. ఆ తరువాత అటుగా ఓ పాము వెల్లడం చూశాడు. మద్యం మత్తులో దాన్ని పట్టుకున్నాడు. ఆ తరువాత ఏదో ఘనకార్యం చేసినట్టు.... ఆ పామును స్నేహితులతకు చూపిస్తూ.. ‘న్యూ ఇయర్ గిఫ్ట్’ అంటూ పెద్ద పెద్దగా అరిచాడు.
ఆ హడావుడికి దడుసుకున్న పాము క్షణంలో మణికందన్ చేతిమీద కాటు వేసింది. దెబ్బకు మణికందన్ స్పృహ కోల్పోయి.. అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతనితో పాటు ఉన్న కపిలన్ అనే మరో వ్యక్తిని కూడా పాము కాటు వేసింది. వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే మణికందన్ మృతి చెందాడు. కపిలన్ మాత్రం ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.