Asianet News TeluguAsianet News Telugu

New Year 2023: 3.50 లక్షల బిర్యానీ, 61,000 పిజ్జా ఆర్డ‌ర్ల‌తో కొత్త సంవ‌త్స‌రంలో దుమ్మురేపిన స్విగ్గీ

New Year 2023: కొత్త సంవ‌త్స‌రంలో హైద‌రాబాద్ బిర్యానీ దుమ్మురేపింది. దేశంలో అమ్ముడుపోయిన బిర్యానీ అర్డ‌ర్ల‌లో ఎక్కువ‌గా హైద‌రాబాద్ బిర్యానీ ఉంద‌ని స్విగ్గీ తెలిపింది. ట్విట్టర్‌లో నిర్వహించిన పోల్ ప్రకారం, హైదరాబాదీ బిర్యానీకి 75.4 శాతం ఆర్డర్లు వచ్చాయని, లక్నో-14.2 శాతం, కోల్‌కతా-10.4 శాతం ఆర్డర్‌లు వచ్చాయని స్విగ్గీ తెలిపింది.

New Year 2023: Swiggy ushers in the New Year with 3.50 lakh biryani, 61,000 pizza orders
Author
First Published Jan 1, 2023, 1:06 PM IST

New Year 2023-Swiggy delivers 3.50 lakh biryani orders: కొత్త సంవ‌త్స‌రంలో హైద‌రాబాద్ బిర్యానీ దుమ్మురేపింది. దేశంలో అమ్ముడుపోయిన బిర్యానీ అర్డ‌ర్ల‌లో ఎక్కువ‌గా హైద‌రాబాద్ బిర్యానీ ఉంద‌ని స్విగ్గీ తెలిపింది. ట్విట్టర్‌లో నిర్వహించిన పోల్ ప్రకారం, హైదరాబాదీ బిర్యానీకి 75.4 శాతం ఆర్డర్లు వచ్చాయని, లక్నో-14.2 శాతం, కోల్‌కతా-10.4 శాతం ఆర్డర్‌లు వచ్చాయని స్విగ్గీ తెలిపింది. వివ‌రాల్లోకెళ్తే.. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ శనివారం 3.50 లక్షల బిర్యానీ ఆర్డర్లను పంపిణీ చేయగా, రాత్రి 10.25 గంటలకు దేశవ్యాప్తంగా 61,000 పిజ్జాలను పంపినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. 

ట్విట్టర్ లో నిర్వహించిన పోల్ లో హైదరాబాదీ బిర్యానీకి 75.4 శాతం ఆర్డర్లు రాగా, లక్నోకు  14.2 శాతం, కోల్ కతాకు 10.4 శాతం ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ తెలిపింది.  3.50 లక్షల ఆర్డర్లతో బిర్యానీ టాప్ ఐటమ్ గా నిలిచింద‌ని తెలిపింది.  ఈ యాప్ శనివారం రాత్రి 7.20 గంటలకు 1.65 లక్షల బిర్యానీ ఆర్డర్‌లను డెలివరీ చేసింది. హైదరాబాద్‌లో అత్యధికంగా బిర్యానీ అమ్ముడవుతున్న రెస్టారెంట్‌లలో ఒకటైన బావార్చి, 2021 కొత్త సంవత్సరం సందర్భంగా నిమిషానికి రెండు బిర్యానీలను డెలివరీ చేసింది. డిసెంబర్ 31, 2022 నాటికి డిమాండ్‌కు అనుగుణంగా 15 టన్నుల రుచికరమైన వంటకాలను సిద్ధం చేసింది. మరో రికార్డును సృష్టించింది. 

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో శనివారం రాత్రి 7 గంటల నాటికి 1.76 లక్షల చిప్స్ ప్యాకెట్లను ఆర్డర్ చేసినట్లు కూడా తెలిపింది. కిరాణా డెలివరీ ప్లాట్‌ఫారమ్ అయిన స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా 2,757 ప్యాకెట్ల డ్యూరెక్స్ కండోమ్‌లు డెలివరీ చేయబడిందని పేర్కొంటూ.. దానిని "6969'గా మార్చడానికి మరో 4,212 ఆర్డర్‌లు చేయవలసిందిగా ప్రజలను అభ్యర్థించింది. "పార్టీ ఇప్పటికే త్వరితగతిన ప్రారంభించబడింది.. మేము ఇప్పటికే 1.3 మిలియన్లకు పైగా ఆర్డర్‌లను డెలివరీ చేసాము.. మా ఫ్లీట్ & రెస్టారెంట్ భాగస్వాములు ఈ NYEని మరచిపోలేని విధంగా చేయడానికి సన్నద్ధమయ్యారు. రద్దీని అధిగమించడానికి ముందుగానే ఆర్డర్ చేయండి" శ్రీహర్ష మెజెటి (Swiggy CEO) నిన్న సాయంత్రం ఒక ట్వీట్‌లో తెలిపారు. అలాగే, కిచిడీ ఆర్డర్లు సైతం అధికంగానే ఉన్నాయ‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. 

45 శాతం పెరిగి జోమాటో డెలివ‌రీలు.. 

ప్రజలు నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు స్విగ్గీతో పాటు జొమాటో సైతం డిసెంబర్ 31న ఆర్డర్‌లలో భారీ పెరుగుదలను నమోదుచేసింది. జొమాటో చీఫ్ ఎగ్జిక్యూటివ్ దీపిందర్ గోయల్.. సంవత్సరాంతపు రద్దీని నివారించడానికి ముందుగానే ఆర్డర్ చేయాలని కస్టమర్‌లను కోరారు. అలాగే, వారి పట్ల జాగ్రత్త వహించారు. “మేము ఇప్పటికే గత సంవత్సరం OPMని తాకాము! ప్రజలారా, దయచేసి చివరి నిమిషంలో రద్దీని..సంభావ్య సర్వర్ FUలను నివారించడానికి ఇప్పుడే ఆర్డర్ చేయండి” అని ఆయన ట్వీట్ చేశారు. 

న్యూ ఇయర్ సందర్భంగా ఆర్డర్ వాల్యూమ్‌ల గురించి ప్రత్యేక ట్వీట్‌లో, “గత సంవత్సరం నుండి ఇప్పటివరకు 45% పెరిగింది!! ఈరోజు మనం క్రేజీ మైలురాళ్లను చేధించనున్నట్టు కనిపిస్తోంది”  అంటూ ట్వీట్ చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios