Unparliamentary Words: పార్లమెంట్ లోని ఉభయ సభల్లో ఉప‌యోగించే పదాలకు సంబంధించి విడుద‌ల చేసిన నూత‌న‌  మార్గదర్శకాలపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువా మొయిత్రా, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది అభ్యంతరాలు వ్య‌క్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.

Unparliamentary Words: లోక్‌సభ సెక్రటేరియట్ విడుదల చేసిన కొత్త బుక్‌లెట్ ప్రకారం.. అన్ పార్ల‌మెంటరీ పదాల‌ను ఉపయోగించడం అనుచిత ప్రవర్తనగా పరిగణించబడుతుంది. సభా కార్యకలాపాలలో భాగం కాదు. అయితే.. నూత‌న అన్‌పార్లమెంటరీ పదాలుపై టిఎంసి ఎంపి మహువా మొయిత్రా, శివసేన ప్రియాంక చతుర్వేది మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

TMC ఎంపి మహువా మొయిత్రా బిజెపిని ఉద్దేశించి.. తన ట్వీట్‌లో ఇలా రాశారు. "కూర్చోండి. ప్రేమతో మాట్లాడండి. లోక్‌సభ, రాజ్యసభల్లో కొత్త అన్‌పార్లమెంటరీ పదాల జాబితాలో సంఘీ అనే ప‌దాన్ని చేర్చలేదు. బిజెపి భారతదేశాన్ని ఎలా నాశనం చేస్తోందో ప్ర‌తిప‌క్షాలు ఉప‌యోగించే అన్ని ప‌దాల‌ను ప్రాథమికంగా ప్రభుత్వం తీసుకుంది. ఆ పదాల‌ను నిషేధించింది. ఎలా విమ‌ర్శించాలి? అని పేర్కొంది.

Scroll to load tweet…

మరోవైపు, శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది పాత ఈ విష‌యాన్ని ప్రస్తావిస్తూ మోడీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రియాంక ట్వీట్ చేస్తూ.. “చేస్తే ఏం చేయాలి, చెబితే ఏం చెప్పాలి? ఓన్లీ, వావ్ మోడీ జీ వావ్!ష‌ ఈ జనాదరణ పొందిన జ్ఞాపకం ఇప్పుడు నిజమనిపిస్తోంది! అని ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…


అన్‌పార్లమెంటరీ పదాలివే..!

ఇకపై నుంచి పార్లమెంట్‌లోని ఉభ‌య‌స‌భ‌ల్లో స‌భ్యులు ఇష్టానుసారంగా మాట్లాడానికి వీల్లేదు. అభ్యంతరకర పదాలు వాడితే.. వారిపై చర్యలు తప్పవు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్‌ ఒక బుక్‌లెట్‌ విడుదల చేసింది. పార్ల‌మెంట్ లో అన్‌పార్లమెంటరీ పదాలు వాడొద్దని స‌భ్యులకు సూచించింది.

ఈ జాబితాలో చేర్చబడిన పదాలు, వాక్యాలు 'అన్‌పార్లమెంటరీ ఎక్స్‌ప్రెషన్' వర్గంలో ఉంచబడ్డాయి. చర్చ సందర్భంగా ఉభయ సభల్లో.. జుమ్లాజీవి, కరోనా వ్యాప్తి, జైచంద్, శకుని, జైచంద్, లాలీపాప్, చందల్ క్వార్టెట్, గుల్ ఖిలాయే, పిట్టు, అరాచకవాది, వినాశ్‌పురుష్, ఖలిస్థానీ, చీటర్, నికమ్మా, బేహ్రీ సర్కార్, కాలా బజారీ, దలాల్, దాదాగిరీ, బేచారా, బాబ్‌కట్, లాలీపాప్, విశ్వాస్‌ఘాత్, సంవేదన్‌హీన్, బ్లడ్‌షెడ్, డాంకీ వంటి పదాలను ఉపయోగించరాదు. 

లోక్‌సభ సెక్రటేరియట్ విడుదల చేసిన కొత్త బుక్‌లెట్ ప్రకారం.. అలాంటి పదాలను ఉపయోగించడం అనుచిత ప్రవర్తనగా పరిగణించబడుతుంది. సభాధ్యక్షులు వాటిని కూడా అన్‌పార్లమెంటరీ పదాలుగా పరిగణించి, తమ విచక్షణ మేరకు రికార్డుల నుంచి తొలగిస్తారని కూడా బుక్‌లెట్‌లో పేర్కొన్నారు. ఈ నెల 18 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.