మార్కెట్లోకి రూ.20 నాణేం చూశారా?
తొలిసారిగా తీసుకువస్తున్న ఈ 20 రూపాయాల నాణేనికి 12 అంచులు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. బహుభుజి ఆకారంలో ఉండే రూ. 20 నాణేం.. దాదాపుగా రూ. 10 నాణేన్ని పోలి ఉంటుంది.
మార్కెట్లోకి రూ.20 నాణేం అడుగుపెట్టింది. గత కొంత కాలం క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఆర్బీఐ) రూ.20 నాణేం విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇవి ఇప్పుడు మార్కెట్లో చలామణి అవుతున్నాయి. గతంలో.. రూ.1 నుంచి 10 రూపాయల నాణేలు వాడుకలో ఉన్నాయి. 2020లో విడుదలైన రూ.20 నాణేలు తాజాగా మార్కెట్లో చలామణిలోకి రావడంతో ప్రజలు వాటిని ఆసక్తిగా చూస్తున్నారు.
తొలిసారిగా తీసుకువస్తున్న ఈ 20 రూపాయాల నాణేనికి 12 అంచులు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. బహుభుజి ఆకారంలో ఉండే రూ. 20 నాణేం.. దాదాపుగా రూ. 10 నాణేన్ని పోలి ఉంటుంది.
కానీ గుండ్రంగా ఉండదు. 27 మిల్లీమీటర్ల వ్యాసంతో రూ. 20 నాణేంను తయారు చేయనున్నారు. రూ. 20 నాణేంలో వెలుపలి లైన్ 65 శాతం కాపర్, 15 శాతం జింక్, 20 శాతం నికెల్తో, ఇక లోపలి భాగం 75 శాతం కాపర్, 20 శాతం జింక్, ఐదు శాతం నికెల్తో తయారవుతుంది.
అయితే రూ. 10 నాణేం మాదిరి రూ. 20 నాణేంకు అంచుల్లో ఎలాంటి గుర్తులు ఉండవు. నాణేనికి ముందువైపు అశోకుడి స్తంభంపై ఉన్న మూడు సింహాల గుర్తు ఉంటుంది. సత్యమేవ జయతే అని హిందీలో రాసి ఉంటుంది. ఒక వైపు భారత్ అని హిందీలో, మరోవైపు ఇండియా అని ఆంగ్లంలో రాసి ఉంటుంది.
అలాగే కేంద్ర ప్రభుత్వం రూ.1, రూ.2, రూ.5, రూ.10 నాణేలలో కొత్త సిరీస్ రిలీజ్ చేయనుంది. ఆర్బీఐ పదేళ్ల కిందట 2009 మార్చిలో రూ.10 నాణేం విడుదల చేయడం గమనార్హం.