New Parliament: కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని మొత్తం 19 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనం ప్రారంభం కానుంది. 

opposition parties to boycott new parliament inauguration: కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని మొత్తం 19 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనం ప్రారంభం కానుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించనందుకు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సహా 19 ప్రతిపక్ష పార్టీలు కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని నిర్ణయించాయి. బహిష్కరణకు పిలుపునిచ్చిన పార్టీల జాబితా.. వాటి అభిప్రాయాలు ఇలా వున్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కాంగ్రెస్ 

కొత్త పార్లమెంటు భవనాన్ని బహిష్కరించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం పదేపదే మర్యాదను అగౌరవపరిచిందని ఆరోపించారు. బీజేపీ-ఆరెస్సెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రపతి కార్యాలయం టోకెనిజానికి పరిమితమైందన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)

కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి అధ్యక్షుడు ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడం ఆమెను అవమానించడమేనని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ట్వీట్ చేశారు. "ఇది కూడా గిరిజనులను అవమానించడమే. రాష్ట్రపతిని మోడీ ఆహ్వానించనందుకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరిస్తుందన్నారు.

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)

పార్టీ నిర్ణయాన్ని ప్రకటిస్తూ రాజ్యసభలో టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయిన్ ట్విటర్ లో "పార్లమెంటు కేవలం కొత్త భవనం మాత్రమే కాదు. ఇది పాత సంప్రదాయాలు, విలువలు, పూర్వాపరాలు, నియమాలతో కూడిన సంస్థ - ఇది భారత ప్రజాస్వామ్యానికి పునాది. ప్రధాని మోడీకి అది అర్థం కావడం లేదు. ఆయనకు ఆదివారం కొత్త భవనం ప్రారంభోత్సవం అంటే నేను, నేను, నేను అనే విధంగా వున్నారు" అని పేర్కన్నారు.

వామపక్ష పార్టీలు

పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేయడమే కాకుండా స్వయంగా ప్రారంభించడానికి కూడా మోడీ రాష్ట్రపతిని దాటవేశారని ఆరోపించిన సిపిఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి.. "కొత్త పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేసినప్పుడు మోడీ రాష్ట్రపతిని దాటవేశారు. ఇప్పుడు కూడా ప్రారంభోత్సవంలోనూ అలానే చేస్తున్నారు. ఇది ఆమోదించదగినది కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 గుర్తు చేసుకోండి. 'యూనియన్ కు ఒక పార్లమెంటు ఉంటుంది, అందులో రాష్ట్రపతి, రెండు సభలు ఉంటాయి" అని పేర్కొన్నారు.