Asianet News TeluguAsianet News Telugu

భద్రతా నిబంధనల అంశంపై రైల్వే బోర్డుపై పార్లమెంటరీ కమిటీ ఆగ్ర‌హం

New Delhi: భద్రతా నిబంధనల విష‌యంలో రైల్వే బోర్డు తీరుపై పార్లమెంటరీ కమిటీ ఆగ్రహం వ్య‌క్తం చేసింది. రవాణా, పర్యాటకం, సాంస్కృతిక శాఖ స్థాయీ సంఘం తన 323వ నివేదికలో ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్) దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, వారు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదనీ, సీఆర్ఎస్ అభిప్రాయాన్ని సమీక్షించకుండా నిబంధనలను సవరించారని పేర్కొంది.
 

New Delhi:Parliamentary Committee angry with Railway Board over safety rules
Author
First Published Dec 8, 2022, 10:58 PM IST

Parliamentary committee: భద్రతా నిబంధనల విష‌యంలో రైల్వే బోర్డు తీరుపై పార్లమెంటరీ కమిటీ ఆగ్రహం వ్య‌క్తం చేసింది. రవాణా, పర్యాటకం, సాంస్కృతిక శాఖ స్థాయీ సంఘం తన 323వ నివేదికలో ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్) దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, వారు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదనీ, సీఆర్ఎస్ అభిప్రాయాన్ని సమీక్షించకుండా నిబంధనలను సవరించారని పేర్కొంది.

వివ‌రాల్లోకెళ్తే.. రైల్వే భ‌ద్ర‌తా నిబంధ‌న‌ల గురించి పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ క‌మిటీ త‌న నివేదిక‌లో రైల్వే తీరును త‌ప్పుప‌ట్టింది. భ‌ద్ర‌తా విష‌యంలో నిర్ల‌క్ష్య ధోర‌ణిని ఎండ‌గ‌ట్టింది. రైల్వే సేఫ్టీ కమిషన్ (సీఆర్ఎస్) సిఫారసులను రైల్వే బోర్డు నిర్లక్ష్యం చేసిందనీ, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీఎఫ్సిసిఐఎల్) లో గూడ్స్ రైళ్ల కార్యకలాపాలకు భద్రతా నిబంధనలను రూపొందించనందుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మంగళవారం రైల్వేను ఖండించింది. సీఆర్ఎస్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అడ్మినిస్ట్రేటివ్ నియంత్రణలో ఉంది. రైలు ప్రయాణం, రైలు కార్యకలాపాల భద్రతకు సంబంధించిన విషయాలను వ్యవహరిస్తుంది.

భద్రతకు సంబంధించిన అంశాలపై సాంకేతిక మార్గదర్శకత్వం అందించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీఆర్ఎస్ సిఫార్సులు / సూచనలను రైల్వే బోర్డు పట్టించుకోకపోవడంపై పార్ల‌మెంట‌రీ కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. డీఎఫ్సీసీఐఎల్, గూడ్స్ రైళ్లకు సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవనీ, డీఎఫ్సీఐఎల్ రూట్లలో జరిగే ప్రమాదాలకు సంబంధించి సీఆర్ ఎస్ కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. రవాణా, పర్యాటకం, సాంస్కృతిక శాఖ తన 323 వ నివేదికలో ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్) దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, వారు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదని, సీఆర్ఎస్ అభిప్రాయాన్ని సమీక్షించకుండా నిబంధనలను సవరించారని పేర్కొంది.

2018లో సీఆర్ఎస్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎంఓఆర్ నిబంధనలను సవరించిందని పార్ల‌మెంట‌రీ కమిటీ పేర్కొంది. ప్రమాదాల్లో కేవలం 8-10 శాతం మాత్రమే సీఆర్ఎస్ ద్వారా విచారణ జరుగుతుందనీ, మిగతా ప్రమాదాలపై రైల్వే శాఖే విచారణ చేస్తుందనీ, ఇలాంటి సందర్భాల్లో నివేదికలను కూడా సీఆర్ఎస్ కు రిఫర్ చేయడం లేదని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. డీఎఫ్సీసీఐఎల్ లో ఇటీవల జరిగిన మూడు ప్రమాదాల్లో రూ.2 కోట్ల పరిమితి కంటే ఎక్కువ నష్టం వాటిల్లిందనీ, దీనిపై రైల్వే బోర్డు కమిషన్ కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని నివేదిక పేర్కొంది.

"ఈ సమస్యకు సంబంధించి కమిషన్ ఇప్పటికే రైల్వే బోర్డును సంప్రదించింది.. కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోలేదు లేదా ఎటువంటి సమాధానం రాలేదు" అని కమిటీ పేర్కొంది. "డిఎఫ్సిసిఐఎల్ 80% అలైన్మెంట్ రైల్వే ప్రయాణీకుల లైన్లకు సమాంతరంగా ఉంది. ఇది డిఎఫ్సిసిఐఎల్ లైన్లలో ప్రమాదాల సందర్భంలో ప్రయాణీకుల భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగిస్తుంది" అని నివేదిక పేర్కొంది. మంత్రిత్వ శాఖ సహాయ నిరాకరణ అనేది దేశానికి లేదా వారు ప్రాతినిధ్యం వహించే సంస్థలకు మంచిది కాదనీ, ఈ పరిస్థితి సురక్షితమైన వాతావరణానికి మంచిది కాదని రైల్వేల తీరుపై విమ‌ర్శ‌లు చేసింది. డీఎఫ్సిసిఐఎల్ లేదా గూడ్స్ రైళ్ల కోసం వెంటనే నిబంధనలను రూపొందించాలనీ, వాటిని సీఆర్ఎస్ పరిధిలోకి తీసుకురావాలని పార్ల‌మెంట‌రీ క‌మిటీ సిఫార్సు చేసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios