నేడు వర్చువల్ సమావేశం నిర్వహించనున్న జీఎస్టీ కౌన్సిల్.. కీలక అంశాలు పరిశీలిస్తున్న కేంద్రం
New Delhi: దాదాపు ఆరు నెలల విరామం తరువాత, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాటు చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
GST Council meeting: శనివారం నాడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్టు చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో పలు కీలక అంశాల చర్చించనున్నట్టు సమాచారం. వివరాల్లోకెళ్తే.. దాదాపు ఆరు నెలల విరామం తరువాత, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనుంది. జీఎస్టీ కౌన్సిల్ 48వ సమావేశం 2022 డిసెంబర్ 17న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ట్వీట్ ద్వారా తెలిపింది. కాగా, అంతకుముందు ఈ ఏడాది జూన్ నెలలో 28 నుంచి 29 వరకు చండీగఢ్ లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. గత నెలలో పశ్చిమ బెంగాల్ మాజీ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని అత్యవసరంగా నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాన ముఖ్య సలహాదారుగా ఉన్న మిత్రా..కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు రాసిన లేఖలో ప్రవర్తనా నియమాల ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రతి త్రైమాసికానికి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కావాలని చెప్పారు. గత సమావేశంలో ఎల్ఈడీ ల్యాంపులు, సోలార్ వాటర్ హీటర్లు వంటి వివిధ వస్తువులపై జీఎస్టీని కౌన్సిల్ పెంచింది. టెట్రా ప్యాక్లపై జీఎస్టీని 12 శాతం నుండి 18 శాతానికి పెంచింది. జీఎస్టీ కౌన్సిల్ సిఫారసు చేసిన రేటు మార్పులు జూలై 18, 2022 నుండి అమలులోకి వచ్చాయి. ఆన్లైన్ గేమింగ్, క్యాసినోల పన్నులను పరిశీలించడానికి జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసిన రాష్ట్రాల మంత్రుల ప్యానెల్ గురువారం తన నివేదికను సీతారామన్ కు సమర్పించింది. శనివారం జరిగే సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ ఈ నివేదికను తీసుకునే అవకాశం ఉంది. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ప్యానెల్ నవంబర్ లో సమావేశమై ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు రేసింగ్ పై 28 శాతం జీఎస్టీని అంగీకరించింది.
వివాదాలను తగ్గించే లక్ష్యంతో పన్ను నిబంధనలపై స్పష్టత తీసుకురావడానికి ఫెడరల్ పరోక్ష పన్ను సంస్థ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టి) కౌన్సిల్ శనివారం డజనుకు పైగా నిబంధనల మార్పులను పరిశీలిస్తుందని కేంద్ర-రాష్ట్ర చర్చల గురించి సమాచారం ఇచ్చిన వ్యక్తి తెలిపారని లైవ్ మింట్ నివేదించింది. వర్చువల్ గా జరిగే 48వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వ్యాపారాల ఈ-ఇన్ వాయిసింగ్ ఆవశ్యకత, ట్రిబ్యునల్స్ లో దివాలా తీసిన వ్యాపారాల విషయంలో జీఎస్టీ చట్టం కింద చట్టబద్ధమైన బకాయిల నిర్వహణ, కార్పొరేట్ సామాజిక భద్రత సంబంధిత ఖర్చులకు పన్ను క్రెడిట్, బీమా కంపెనీలు అందించే నో క్లెయిమ్ బోనస్ వంటి అంశాలపై కేంద్ర, రాష్ట్ర ఆర్థిక మంత్రులు స్పష్టత ఇవ్వనున్నారు. అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని వ్యక్తి తెలిపినట్టు ఈ కథనం పేర్కొంది. ఇప్పటివరకు అభివృద్ధి చెందిన అనుభవం, న్యాయశాస్త్రం వెలుగులో చట్టపరమైన నిబంధనలను హేతుబద్ధీకరించడానికి నియమ మార్పుల పరంపర ఉద్దేశించబడింది.