హెలిక్యాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ మరణించిన నాటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. అయితే ఆ పదవిని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. త్వరలోనే భారత్ కు కొత్త సీడీఎస్ ను నియమిస్తామని చెప్పారు.
కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS)ని త్వరలోనే నియమిస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. తదుపరి సీడీఎస్ కోసం జాబితాలో 40 మందికి పైగా ఉన్నారని మంత్రి తెలిపారు. ఈ సీడీఎస్ నియామకానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీ అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీమ్ కోసం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు.
అగ్నిపథ్ స్కీం ఏమిటి? ఎప్పుడు అప్లై చేసుకోవాలి? ఎంత జీతం?
గత ఏడాది డిసెంబర్ 8వ తేదీన జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అప్పటి నుంచి భారత సీడీఎస్ పదవి ఖాళీగా ఉంది. అయితే ఈ నెల ప్రారంభంలో నోటిఫికేషన్లు జారీ చేయడానికి, సీడీఎస్ పదవికి ఎంపిక ప్రక్రియను విస్తరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్న నేపథ్యంలో రాజ్ నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త నిబంధనల ప్రకారం.. 62 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న లెఫ్టినెంట్ జనరల్, ఎయిర్ మార్షల్, వైస్-అడ్మిరల్ సర్వీస్ చేసినా లేకపోతే రిటైర్డ్ అయిన వ్యక్తి సీడీఎస్ గా ఎంపికవ్వడానికి అర్హుడిగా ఉంటారు.
మూడో వ్యక్తితో భార్య పారిపోయిందని పోలీసులను ఆశ్రయించిన ఇద్దరు భర్తలు.. ఎక్కడంటే..
ఇంకా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ చట్టాలలో చేర్చబడిన మార్పులు ఇప్పుడు త్రీ-స్టార్ ఆఫీసర్లు సీడీఎస్ గా నియమితమవ్వడానికి అర్హత కలిగి ఉండటానికి, అలాగే ముగ్గురు సర్వీస్ చీఫ్ లకు కూడా అవకాశం కల్పిస్తోంది. కాగా జనరల్ రావత్ భారతదేశం మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఆయన 2020 జనవరి 1వ తేదీన ఈ పదవి బాధ్యతలు స్వీకరించారు. భారత సాయుధ దళాల మూడు విభాగాల పనితీరులో ఏకీకరణను తీసుకురావడానికి, దేశం మొత్తం సైనిక పరాక్రమాన్ని పెంచడానికి సీడీఎస్ తప్పనిసరిగా ఉండాలి.
అగ్నిపథ్ స్కీం ఏమిటి? ఎప్పుడు అప్లై చేసుకోవాలి? ఎంత జీతం?
CDS కూడా సైనిక కమాండ్ల పునర్నిర్మాణాన్ని సులభతరం చేయడంతో పాటు థియేటర్ కమాండ్ల స్థాపనతో సహా కార్యకలాపాలలో భాగస్వామ్యాన్ని నిర్ధారించడం ద్వారా వనరులను ఉత్తమంగా ఉపయోగించుకోవచ్చు. 1999 కార్గిల్ యుద్ధం తర్వాత భారతదేశ భద్రతా వ్యవస్థలోని లోపాలను పరిశీలించేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. రక్షణ మంత్రికి సింగిల్ పాయింట్ మిలటరీ అడ్వైజర్గా సీడీఎస్ ను నియమించాలని ప్యానెల్ సిఫార్సు చేసింది. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగానే సీడీఎస్ నియామకం జరిగింది.
