భారత్ పై జర్మనీ అక్కసు వెల్లగక్కింది. మన దేశంలో జనాభా పెరుగుదలను చూపిస్తూ ఆ దేశానికి చెందిన ఓ మ్యాగజైన్ వ్యంగ్యంగా కార్టూన్ గీసి ప్రచురించింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

భారత్ లో జనాభా ఇటీవల చైనాను అధిగమించింది. దీనిపై జర్మనీకి చెందిన ఓ మ్యాగజైన్ వ్యంగ్యంగా కార్డున్ గీసింది. ఈ కార్టున్ పై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. కేంద్ర మంత్రులు, పలు రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు జర్మనీని నిందిస్తున్నారు. జర్మన్ మ్యాగజైన్ డెర్ స్పీగెల్ ప్రచురించిన కార్టూన్ లో.. భారతదేశ ప్రజలు ఓ రైలులో కిక్కిరిసి ఓ ట్రాక్ పై వెళ్తున్నారు. పక్క నుంచి చైనాకు చెందిన బుల్లెట్ ట్రైన్ ఈ రైలును దాటి ముందుకు వెళ్తోంది. ఆ బుల్లెట్ ట్రైన్ లో కూర్చున్న లోకో పైలెట్లు మన రైలు, అందులో పైనా, లోపల కూర్చున్న ప్రయాణికులను చూసి ఆశ్చర్యపోతున్నారు. 

పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ మరణం.. 2 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం

ఈ కార్టున్ పై భారతీయులు స్పందిస్తున్నారు. జర్మనీది జాత్యహంకార ధోరణి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది అవమానకరమైన కార్టూన్ అంటూ ట్విట్టర్ లో కామెంట్లు చేస్తున్నారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ కూడా ట్వీట్ చేశారు. ‘‘ డియర్ కార్టూనిస్ట్.. మీరు భారతదేశాన్ని అపహాస్యం చేసే ప్రయత్నం చేసినప్పటికీ... ప్రధాని నరేంద్రమోదీ జీ ఆధ్వర్యంలో కొన్నేళ్లలో భారత్ జర్మనీ కంటే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది’’ అని పేర్కొన్నారు.

Scroll to load tweet…

వైసీపీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి దీనిపై స్పందిస్తూ.. ‘‘భారతదేశాన్ని పేద దేశంగా చూపించడానికే పాశ్చాత్య దేశీయులు ఇష్టపడతారు. కానీ భారత్ లో ఉన్న వందే భారత్ ఎక్స్ ప్రెస్, బుల్లెట్ రైళ్లను చూపించరు. భారత్ కూడా జర్మనీ జీడీపీని అధిగమిస్తుంది. 4వ అతి పెద్ద జీడీపీగా ఎదిగే కాలం మరెంతో దూరంలో లేదు’’ అని ట్వీట్ చేశారు.

Scroll to load tweet…

అలాగే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా స్పందిస్తూ.. ‘‘ హాయ్ జర్మనీ. ఇది దారుణమైన జాత్యహంకారం. డెర్ స్పీగెల్ ఈ పద్ధతిలో భారతదేశం గీసిన వ్యంగ్య చిత్రానికి వాస్తవికతో పోలిక లేదు. భారత్‌ను చిన్నచూపు చూపిస్తూ.. చైనాను పీల్చిపిప్పి చేయడమే దీని ఉద్దేశం’’ అని వ్యాఖ్యానించారు.

Scroll to load tweet…

ఇటీవల ఐక్యరాజ్యసమితి వెల్లడించిన వివరాల ప్రకారం.. భారతదేశం 1,425,775,850 జనాభాతో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారింది. జనాభాలో చైనాను అధిగమించింది. 1950లో జనాభా వివరాలను సేకరించడం ప్రారంభించిన తర్వాత అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలవడం ఇదే తొలిసారి.