Asianet News TeluguAsianet News Telugu

నేతాజీకి మోడీ ఘన నివాళీ... బోస్ జయంతి ఇకపై పరాక్రమ్ దివస్

అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తెప్పించలేమని భావించి రక్తానికి.. రక్తమే అన్నట్లుగా పోరాటాన్ని నడిపారు నేతాజీ సుభాష్ చంద్రబోస్. భారత స్వతంత్ర సంగ్రామంలో ఆ మహనీయుడు పోషించిన పాత్ర, భారతీయులపై వేసిన ముద్ర మరువలేనిది.

Netaji Subhas Chandra Boses birth anniversary to be celebrated as Parakram Diwas annually ksp
Author
New Delhi, First Published Jan 19, 2021, 3:07 PM IST

అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తెప్పించలేమని భావించి రక్తానికి.. రక్తమే అన్నట్లుగా పోరాటాన్ని నడిపారు నేతాజీ సుభాష్ చంద్రబోస్. భారత స్వతంత్ర సంగ్రామంలో ఆ మహనీయుడు పోషించిన పాత్ర, భారతీయులపై వేసిన ముద్ర మరువలేనిది.

ఈ నేపథ్యంలో ఆయన పుట్టినరోజు నాడు ఏటా ఘన నివాళులర్పించేందుకు మోడీ సర్కార్ సిద్ధమైంది. నేతాజీ జయంతి (జనవరి 23) నాడు ప్రతి ఏడాది పరాక్రమ దివస్‌గా జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

భారతీయుల ప్రియతమ నేత, దేశం కోసం నిస్వార్థంగా పనిచేసిన నాయకుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించామని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

2021 నుంచి ఆయన జయంతిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ‘పరాక్రమ దివస్‌’గా నిర్వహించనున్నామని వెల్లడించింది. దేశ ప్రజల్లో ముఖ్యంగా యువతలో స్ఫూర్తిని నింపి వారిలో దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.

మరోవైపు ఈసారి ఆయన జయంతికి రాజకీయ ప్రాధాన్యం కూడా ఏర్పడే అవకాశం ఉంది. అప్పట్లో నేతాజీ స్వతంత్ర పోరాటానికి కేంద్రంగా ఉన్న కోల్‌కతాలో.. ఈ జనవరి 23న ఆయనకు నివాళులర్పించేందుకు ప్రధాని మోదీ పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అదే రోజు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతాజీకి నివాళిగా పాదయాత్ర నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో ఈ రెండు పార్టీల మధ్య ప్రస్తుతం తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతున్న నేపధ్యంలో నేతాజీ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios