సారాంశం

Mumbai: మహారాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కలిసి పోటీ చేస్తుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయ‌కుడు అజిత్ పవార్ అన్నారు. ఎంవీఏ మిత్రపక్షాల్లో శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే), కాంగ్రెస్, ఎన్సీపీలు ఉన్నాయి.
 

NCP leader Ajit Pawar:  శివసేన (ఏక్ నాథ్ షిండే గ్రూప్)-బీజేపీ కూటమిని ఓడించేందుకు మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) మహారాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ తెలిపారు. ఎంవీఏ మిత్రపక్షాల్లో శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే), కాంగ్రెస్, ఎన్సీపీలు ఉన్నాయి. మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) అగ్రనేతలు రాబోయే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారనీ, తమ సీనియర్లను అనుసరించి తాము (పార్టీ కార్యకర్తలు) మద్దతిస్తున్నామని మహారాష్ట్రలోని పూణేలో విలేకరులతో అజిత్ పవార్ తెలిపారు. సొంత పార్టీ గురించి ఆలోచించకుండా మెరిట్ ఆధారంగా పోటీ చేసే అభ్యర్థి విషయంలో ఎంవీఏ నేతలు కలిసి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. 

"ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత పార్టీ గురించి ఆలోచించకుండా ఎంవీఏ నేతలు కూర్చొని మెరిట్ ఆధారంగా అభ్యర్థిని నిర్ణయిస్తారు. ఎంవీఏ ఎమ్మెల్యే, ఎంపీని ఎలా ఎంపిక చేయాలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఈ విష‌యం ఎంవీఏలోని అన్ని పార్టీలు క‌లిసి ముందుకు సాగుతాయి. ప్రతి పార్టీ దాని కోసం కృషి చేస్తోంది" అని తెలిపారు. ఎంవీఏ కూటమి ప్రాముఖ్యతను వివరిస్తూ, ఎంవీఏలోని పార్టీలు ఒంటరిగా పోటీ చేసి గెలవలేవన్నది వాస్తవమని శరద్ పవార్ అన్నారు. అందువల్ల, ఏక్ నాథ్ షిండే ప్రస్తుత శివసేన-భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రస్తుత కూటమిని ఓడించడానికి, ఎటువంటి తేడా లేకుండా కలిసి ఎన్నికలలో పోటీ చేయాల‌న్నారు.

అలాగే, "ఎంవీఏలోని పార్టీలు లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయలేవన్నది వాస్తవం. ఒంటరిగా పోటీ చేయడం ద్వారా విజయం సాధ్యం కాదన్న వాస్తవాన్ని మనమందరం అంగీకరించాలి. అందువల్ల ప్రస్తుత ఏక్ నాథ్ షిండే, బీజేపీ కూటమిని ఓడించాలంటే మనం కలిసి ఉండాలి. ఎలాంటి తేడా లేకుండా కలిసి పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తాం. ఎంవీఏ క‌లిసి ముందుకు సాగాలి" అని అజిత్ ప‌వార్ అన్నారు. కాగా, 2024లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.