Asianet News TeluguAsianet News Telugu

నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా సమావేశంలో కీలక నిర్ణయాలు.. రూ. 2,700 కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం

మిషన్ గంగా: నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్‌ఎంసిజి) సమావేశంలో గంగా బేసిన్‌లో మురుగునీటి పారుదల మౌలిక సదుపాయాల అభివృద్ధికి సుమారు రూ.2,700 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని  జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

National Clean Ganga Mission approves sewerage projects worth Rs 2,700 cr
Author
First Published Dec 27, 2022, 10:49 PM IST

నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (NMCG) సమావేశంలో ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో మురుగునీటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి సుమారు రూ. 2,700 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆమోదించింది. ఇటీవల ఎన్‌ఎంసిజి డైరెక్టర్ జనరల్ జి అశోక్ కుమార్ అధ్యక్షతన ఎన్‌ఎంసిజి ఎగ్జిక్యూటివ్ కమిటీ 46వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, బెంగాల్ రాష్ట్రాల్లో మురుగునీటి పారుదల మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.2,700 కోట్ల విలువైన 12 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

ఈ ప్రాజెక్టులతో పాటు ఉత్తరాఖండ్ మరియు బీహార్‌లలో 2022-23 సంవత్సరానికి రూ.42.80 కోట్ల అంచనా వ్యయంతో అడవుల పెంపకం కార్యక్రమాలు ఆమోదించబడ్డాయి. బెంగాల్‌లోని కోల్‌కతాలో గంగ యొక్క ఉపనది అయిన ఆది గంగ పునరుద్ధరణకు 653.67 కోట్లు ఆమోదించబడ్డాయి. ఈ కార్యక్రమాలు కమ్యూనిటీ భాగస్వామ్య విధానంతో వాతావరణాన్ని తట్టుకోగల మరియు స్థిరమైన పర్యావరణ వ్యవస్థ నిర్వహణకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నాయని జల్ శక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది.

యుపి-బీహార్ ప్రాజెక్టులకు ఆమోదం

ఉత్తరప్రదేశ్‌లో మూడు ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటిలో ప్రయాగ్‌రాజ్‌లో రూ.475.19 కోట్లు, లక్నోలో రూ.264.67 కోట్లు, హత్రాస్‌లో రూ.128.91 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి. అలాగే..  బీహార్‌లో దౌద్‌నగర్‌, మోతీహారీలకు ఒక్కో ప్రాజెక్టుకు వరుసగా రూ.42.25 కోట్లు, రూ.149.15 కోట్లకు అనుమతి లభించింది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో 808.33 కోట్ల భారీ ప్రాజెక్ట్ ఆమోదించబడింది.


దామోదర్ నది కాలుష్య నివారణ ప్రాజెక్ట్

NMCG యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో జార్ఖండ్‌లోని ఒక ప్రధాన ప్రాజెక్ట్ ఆమోదించబడింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ధన్‌బాద్ నగరంలో రూ. 808.33 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 192 ఎంఎల్‌డి సామర్థ్యంతో ఐదు ఎస్‌టిపిలను నిర్మించనున్నారు. గంగా నదికి ముఖ్యమైన ఉపనది అయిన దామోదర్ నదిలో కాలుష్యాన్ని తగ్గించేందుకే ఈ ప్రాజెక్ట్ అని జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది.ఈ ప్రాజెక్ట్ ఆమోదంతో జార్ఖండ్‌లోని దామోదర్ నదిలో కాలుష్యాన్ని తగ్గించడానికి అవసరమైన అన్ని ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. పతంజలి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (PRI) , పతంజలి ఆర్గానిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (PORI), హరిద్వార్, ఉత్తరాఖండ్‌ల సహకారంతో ఈ ప్రాజెక్ట్ అమలు చేయబడుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios