ఇతర రాష్ట్రాల లవ్ జిహాద్ వ్యతిరేక చట్టాలను అధ్యయనం చేస్తాం: దేవేంద్ర ఫడ్నవీస్
Nagpur: ఇతర రాష్ట్రాల లవ్ జిహాద్ చట్టాలను అధ్యయనం చేస్తామని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. శ్రద్ధా వాకర్ కేసుకు సంబంధించి మహారాష్ట్రలో లవ్ జిహాద్ సంఘటనలు పెద్ద ఎత్తున కనిపించాయని ఒక భావన ఉందని ఆయన అన్నారు.
Maharashtra Deputy CM Devendra Fadnavis: ఇతర రాష్ట్రాలు రూపొందించిన లవ్ జిహాద్ వ్యతిరేక చట్టాలను మహారాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసి తగిన నిర్ణయం తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నాయకులు దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. నాగ్పూర్లోని మహారాష్ట్ర శాసనసభ సముదాయంలో విలేకరులతో మాట్లాడిన ఫడ్నవీస్.. శ్రద్ధా వాకర్ కేసుకు సంబంధించి సభలో లవ్ జిహాద్ ఉదంతాలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయని భావన ఉందని అన్నారు. “వివిధ రాష్ట్రాలకు లవ్ జిహాద్పై చట్టాలు ఉన్నాయనీ, వాటిని అధ్యయనం చేస్తామని మేము (సభకు) హామీ ఇచ్చాము. దాని ఆధారంగా, మా ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుంది. తద్వారా ఏ స్త్రీ లేదా బాలిక ఎటువంటి కుట్రతో బాధపడకుండా ఉంటుంది” అని ఫడ్నవిస్ అన్నారు.
కాగా, "లవ్ జిహాద్" అనేది హిందూ స్త్రీలను వివాహం ద్వారా మత మార్పిడికి ఆకర్షించడానికి ముస్లిం పురుషులు చేసిన పన్నాగాన్ని ఆరోపించడానికి మితవాద కార్యకర్తలు తరచుగా ఉపయోగించే పదం. దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ లవ్ జిహాద్పై కఠిన చట్టం తేవాలని డిమాండ్ చేశారు. అయితే, మతాంతర వివాహాలకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. “కానీ కుట్రలో భాగంగా ప్రణాళికబద్ద చర్య ఉందని కాలక్రమేణా గ్రహించబడింది. కొన్ని జిల్లాల్లో ఇలాంటి వివాహాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి" అని ఆయన అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు అతుల్ భత్ఖల్కర్, ఆశిష్ షెలార్ శ్రద్ధా వాకర్ హత్య అంశాన్ని దిగువ సభలో లేవనెత్తారు. నవంబర్ 2020 లో వాసాయి పోలీసులకు తన లివ్ ఇన్ భాగస్వామి ఆఫ్తాబ్ పూనావాలాపై దాఖలు చేసిన వేధింపుల ఫిర్యాదును శ్రద్దా వాకర్ ఉపసంహరించుకోవడంపై భత్ఖల్కర్ మాట్లాడుతూ "ఫిర్యాదు అందుకున్నప్పుడు చర్యలు తీసుకోవద్దని పోలీసులపై రాజకీయ ఒత్తిడి ఉందా?" ఆ సమయంలో అమరావతి ఫార్మసిస్ట్ ఉమేష్ కొల్హే హత్యకు గురయ్యారనీ, ఈ రోజు ఛార్జిషీటులో తబ్లిగీ జమాత్ పేరు ఉందని ఆయన అన్నారు.
ఎమ్మెల్యే షెలార్ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. మంత్రి నేతృత్వంలోని ఇంటర్-ఫెయిత్ కమిటీ, మతాంతర వివాహాలు, వివాహిత జంటలు, వారి కుటుంబాల రికార్డులను ట్రాక్ చేసి నిర్వహిస్తుందని ఫడ్నవీస్ చెప్పారు. రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడిన సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అసిమ్ అజ్మీ.. శ్రద్దా వాకర్ కేసు ఇప్పుడు చిత్రీకరించబడుతున్నందున అది లవ్ జిహాద్ సమస్య కాదని అన్నారు. ఇది ఒక సామాజిక అంశం, లైవ్-ఇన్ రిలేషన్షిప్ కు సంబంధించిన పరిణామాల గురించినదని అన్నారు. పెద్దలు ఎవరైనా తనకు నచ్చిన విధంగా జీవించాలని నిర్ణయించుకోవచ్చనీ, ఆ ఘటనను లవ్ జిహాద్ గా పేర్కొంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. హిందువులు, ముస్లింలను విభజించేందుకు మతాంతర వివాహాల తనిఖీ కమిటీని ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేశారని అజ్మీ ఆరోపించారు.
లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా చట్టం తీసుకువచ్చిన పలు రాష్ట్రాలు..
2020 నవంబర్ లో లవ్ జిహాద్ వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చిన మొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ అవతరించింది. గవర్నర్ ఆనందిబెన్ పటేల్ యూపీ చట్టవిరుద్ధమైన మత మార్పిడి ఆర్డినెన్స్ 2020ని ప్రకటించారు. ఈ చట్టం ఉత్తరప్రదేశ్లో బలవంతంగా లేదా నిజాయితీ లేని మత మార్పిడులను అరికట్టడానికి ఉద్దేశించబడింది. 'లవ్ జిహాద్' చెక్ చేయడానికి వీలును పరిశీలిస్తుంది. ఉత్తరాఖండ్ మత స్వేచ్ఛ (సవరణ) బిల్లు, 2022ని ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఈ ఏడాది నవంబర్లో ఆమోదించింది. 2018 “మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని” బలోపేతం చేయడానికి దీనిని తీసుకువచ్చారు. అలాగే, మధ్యప్రదేశ్, కర్నాటక, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లు సైతం ఈ తరహా చట్టాలను తీసుకువచ్చాయి.