భార్యను హత్య చేసి.. బాత్ రూం లో పూడ్చేసి.. పెళ్లి రోజు నాడే ఘాతుకం..
పెళ్లి రోజునాడే ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా గిఫ్ట్ ఇస్తాడని ఆశగా ఎదురుచూసిన భార్యను అతి కిరాతంగా చంపేసి, బాత్ రూంలో పూడ్చి పెట్టాడు.
పెళ్లి రోజు నాడు సాధారణంగా ఏం చేస్తుంటారు. ఎవరైనా తన జీవిత భాగస్వామికి సర్ ప్రైజ్ ఇద్దామనుకుంటారు. భర్తలైతే తన భార్యకు చీరలనో, ఫ్లవర్ బొకేనో లేదా తనకు ఇష్టమైన ఆహారాన్ని తీసుకెళ్తారు. మరి కొందరు ఆమెకు తెలియకుండా ఒక సర్ ప్రైజ్ ప్లాన్ చేసి ఎక్కడికైనా టూర్ కు తీసుకెళ్లడమో లేదా తనకు ఇష్టమైనవి చేయడమో చేస్తుంటారు. భార్యలు కూడా అంతే భర్తతో మ్యారేజ్ యానివర్సరీకి ఎలాంటి గిఫ్ట్ ఇద్దామా ? తన భర్తకు ఏం నచ్చుతుందని ఆలోచిస్తారు. ఎవరికి అందుబాటులో ఉన్న వనరులతో వారు ఈ పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకుంటారు.
అయితే ఓ భర్త మాత్రం మ్యారేజ్ యానివర్సరీకి భార్య ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు. బహుశా ఏ భార్య కూడా భర్త ఇలాంటి పని చేస్తాడని ఊహించరు. కర్నాటక రాష్ట్రం చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన సుమ (26) నారప్ప ఇద్దరు దంపతులు. వీరిద్దరికి పెళ్లయి ఏడాది అవుతోంది. అయితే గత నెల డిసెంబర్ 25వ తేదీన భార్య సుమను చంపేశాడు. తరువాత ఆమె మృతదేహాన్ని బాత్ రూమ్లో పూడ్చేశాడు. అయితే సరిగ్గా అదే రోజు వారి పెళ్లి రోజు కావడం గమనార్హం. తరువాత తెలియనట్టు పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన భార్య కనిపించడం లేదని వారితో చెప్పారు. అతడి తీరుతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో వాళ్లు నివసించే ఇంటికి వచ్చారు. ఇళ్లంతా తనిఖీ చేశారు. దీంతో సుమ మృతదేహం బయటపడింది. భర్త నారప్పను పోలీసులు విచారించగా.. తానే చంపేసినట్టు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.