యువకులకు వధువులను ఇవ్వడం లేదు.. సామాజిక సమస్యలను సృష్టిస్తున్న బీజేపీ ప్రభుత్వాలు : శరద్ పవార్
Mumbai: "మన రైతులు ఉత్పత్తిని పెంచినందున దేశంలో ఆకలి సమస్యను పరిష్కరించడం సాధ్యమే, కాని అధికారంలో ఉన్నవారు రైతులకు సరైన సాయం అందించడానికి, పంటకు గిట్టుబాటు ధర కల్పించడానికి సిద్ధంగా లేరు, బదులుగా వారు మధ్యవర్తుల ప్రయోజనాలను కాపాడుతున్నారు.. సామాన్య ప్రజలను ద్రవ్యోల్బణ అగాధంలోకి నెట్టారు" అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ బీజేపీపై విమర్శలు గుప్పించారు.

NCP chief Sharad Pawar: "నిరుద్యోగం కారణంగా యువకులకు వధువులు దొరకడం లేదు. నేటి యువత విద్యావంతులనీ, ఉద్యోగాలు కోరే హక్కు వారికి ఉందని" నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ అన్నారు. నేటి సమస్యలకు కేంద్ర, రాష్ట్రాల్లో కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు.
వివరాల్లోకెళ్తే.. నిరుద్యోగంపై కేంద్రంలో, మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వాలను విమర్శిస్తూ, పెళ్లి వయసులో ఉన్న యువకులకు వధువులు దొరకడం లేదనీ, ఆయా ప్రభుత్వాలు సామాజిక సమస్యలను సృష్టిస్తున్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ అన్నారు. బుధవారం పూణేలో ఎన్సీపీ జన్ జాగర్ యాత్ర ప్రచారాన్ని ప్రారంభించే ముందు పవార్ మాట్లాడుతూ, వర్గాల మధ్య చీలిక ఏర్పడిందనీ, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి వాస్తవ సమస్యల నుండి దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. నేటి యువత విద్యావంతులనీ, ఉద్యోగాలు డిమాండ్ చేసే హక్కు వారికి ఉందని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగం కారణంగా సమాజంలో కొత్త సామాజిక సమస్యలను సృష్టిస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశంలో రైతులు అందరి ఆకలి తీరుస్తుంటే ప్రభుత్వం మాత్రం వారికి తగిన సాయం అందించడం లేదనీ, పంటకు గిట్టుబాటు ధరను సైతం కల్పించడం లేదని అభిప్రాయపడ్డారు.
“మన రైతులు ఉత్పత్తిని పెంచినందున దేశంలో ఆకలి సమస్యను పరిష్కరించడం సాధ్యమవుతుంది, కానీ అధికారంలో ఉన్న వ్యక్తులు రైతులకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా లేరు, బదులుగా వారు మధ్యవర్తుల ప్రయోజనాలను కాపాడుతున్నారు. సాధారణ ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టివేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతోంది" అని పవార్ అన్నారు. నేటి యువత విద్యావంతులని, ఉద్యోగాలు కోరే హక్కు వారికి ఉందని కేంద్ర మాజీ వ్యవసాయ మంత్రి అయిన శరద్ పవార్ అన్నారు. మహారాష్ట్ర నుంచి పరిశ్రమలు తరలి వెళ్తున్నాయని, ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడం లేదని, కొత్త వ్యాపారాలు స్థాపించేందుకు ఎలాంటి అవకాశాలు కల్పించడం లేదని, దీని వల్ల నిరుద్యోగం పెరుగుతోందని పవార్ అన్నారు.
"ఒకసారి నేను ప్రయాణిస్తున్నప్పుడు 25 నుండి 30 సంవత్సరాల వయస్సు గల 15 నుండి 20 మంది పురుషులు ఒక గ్రామంలోని పబ్లిక్ స్క్వేర్లో ఖాళీగా కూర్చోవడం నాకు కనిపించింది.. నేను వారిని కలిసి వారు ఏం చేస్తున్నారు? ఏం చదువుకున్నారని అడిగాను.. వారిలో కొంతమంది గ్రాడ్యుయేట్లు అని చెప్పగా, మరికొంత మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు చెప్పారు. వారు వివాహం చేసుకున్నారా అని నేను అడిగినప్పుడు, ప్రతి ఒక్కరూ లేదని ప్రతికూలంగా స్పందించారు”అని పవార్ అన్నారు. అయితే, దీనికి కారణం ఏమిటని అడగ్గా.. తమకు ఉద్యోగాలు లేకపోవడంతో పెళ్లికూతుళ్లు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరని చెప్పారని అన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే, ఉపాధి అవకాశాలను పెంపొందించే విధానాలను అవలంబించడానికి బదులుగా, వివిధ వర్గాలు-మతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.
రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు యాదృచ్ఛికంగా ఏదో ఒక అంశాన్ని సృష్టిస్తున్నారని.. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని అన్నారు.