Asianet News TeluguAsianet News Telugu

ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం..  కిటికీలోంచి దూకిన బాలిక..

ముంబయిలోని మలాద్ ప్రాంతం నుండి పిడుగులాంటి వార్త బయటకు వచ్చింది. జాన్‌కళ్యాణ్‌నగర్‌ సమీపంలోని బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 వాహనాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి.

Mumbai Fire breaks out in 21-storey residential building in Malad
Author
First Published Dec 3, 2022, 1:21 PM IST

ముంబయిలోని మలాడ్ వెస్ట్ సెవ్రీ ప్రాంతంలోని ఓ గోడౌన్‌లో శనివారం (డిసెంబర్ 3) భారీ అగ్నిప్రమాదం జరిగింది. జాన్‌కళ్యాణ్‌నగర్‌ సమీపంలోని 21 అంతస్తుల భవనంలోని మూడో అంతస్తులో గదిలో మంటలు చెలరేగినట్లు బృహన్‌ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) వెల్లడించింది. ఈ సంఘటన ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడినట్లు తెలుస్తోంది. క్షత్రగాత్రులను చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు తెలిపిన సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.  

జనకళ్యాణనగర్‌లోని మెరీనా ఎన్‌క్లేవ్‌లోని మూడో అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే ఈ అంతస్తు నుంచి మంటలు రావడం మొదలైంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని కేవలం 15 నిమిషాల్లో మంటలను అదుపులోకి తెచ్చినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఓ బాలిక కిటీకిలోంచి దూకి ప్రాణాలు కాపాడుకుంది. ఈ సమయంలో ఆ బాలికకు స్వల్పగాయాలు అయ్యాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. దీని తర్వాత మాత్రమే వివరణాత్మక వివరణ ఇవ్వబడుతుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios