ప్రాణం తీసిన ఫోన్.. దొంగను పట్టుకోబోయి, రైలుకింద పడి...
ముంబైలో విషాదం చోటు చేసుకుంది. దొంగను పట్టుకోబోయి రైల్లో నుంచి జారిపడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ముంబైలోని కల్వా, ముంబ్రా స్టేషన్ల మధ్య నడుస్తున్న లోకల్ ట్రైన్ లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
ముంబైలో విషాదం చోటు చేసుకుంది. దొంగను పట్టుకోబోయి రైల్లో నుంచి జారిపడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ముంబైలోని కల్వా, ముంబ్రా స్టేషన్ల మధ్య నడుస్తున్న లోకల్ ట్రైన్ లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తున్న క్రమంలో ఓ మహిళ చేతిలోని మొబైల్ ఫోన్ లాక్కోవడానికి ఓ దొంగ ప్రయత్నించాడు. దీంతో విద్యాపాటిల్ (35) అనే ఆ మహిళ దొంగతో పోరాడింది. పెనుగులాటలో రైల్లో నుంచి జారిపడిపోయింది. బాధితురాలిని డోంబివ్లి నివాసిగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఆమె ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో కుర్లా స్టేషన్ లో రైలు ఎక్కారు. ఫైసల్ షేక్ అనే వ్యక్తి రాత్రి 7.15 గంటలకు కల్వా స్టేషన్ దగ్గర కంపార్ట్ మెంట్లోకి ప్రవేశించాడు. అతడు పాటిల్ దగ్గరున్న ఫోన్ లాక్కుని రైలు దిగి పారిపోవడానికి ప్రయత్నించాడు.
దారుణం: కోవిడ్ మృతదేహాలను పీక్కుతింటున్న కుక్కలు... స్థానికుల కంటతడి...
కానీ ఆమె దాన్ని ప్రతిఘటించింది. ఈ పెనుగులాటలో నిందితుడు ఆమెను నెట్టేశాడు. దీంతో ఆమె రైలు కింద పడిపోయింది. కాగా మహిళను రక్షించే ప్రయత్నంలో కోచ్ లోని ప్రయాణికులు వెంటనే గొలుసును లాగారు.
ఆ తర్వాత రైలు డ్రైవర్ రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నిందితుడిని మంబ్రాకు చెందిన ప్రభుత్వ రైల్వే పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. రిమాండ్ కు తరలించారు.