గ్రేట్ బ్రిటన్ ఇండియాకు ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందే: రాజీవ్ చంద్రశేఖర్
గ్రేట్ బ్రిటన్ ఇండియా నుండి తీసుకెళ్లిన నిధుల చెల్లింపు విషయమై ఓ చర్చ జరగాల్సిన అసవరం ఉందని ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.
అయితే ఈ నిధులను ఎప్పుడు, ఎలా గ్రేట్ బ్రిటన్ చెల్లిస్తోందనే విషయమై చర్చ జరగాలన్నారు.
న్యూఢిల్లీ: గ్రేట్ బ్రిటన్ ఇండియా నుండి తీసుకెళ్లిన నిధుల చెల్లింపు విషయమై ఓ చర్చ జరగాల్సిన అసవరం ఉందని ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ నిధులను ఎప్పుడు, ఎలా గ్రేట్ బ్రిటన్ చెల్లిస్తోందనే విషయమై చర్చ జరగాలన్నారు.
I think a discussion must start abt how n when #GreatBritain can start repaying its debts to #India !
— Rajeev Chandrasekhar 🇮🇳 (@rajeev_mp) June 10, 2019
Great Britain Holland Portugal France - its time that they start returning back the wealth they took from “colonies” n the people who it belongs to https://t.co/JggeIwID0S
గ్రేట్ బ్రిటన్ హాలండ్, పోర్చుగల్, ఫ్రాన్స్లు ....ఏ ప్రజల నుండి సంపాదించిన ఆస్తులను ఆ దేశ ప్రజలకు ఇచ్చే సమయం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సంపద ఎవరికి చెందుతోందో.. వారికి ఈ సంపదను తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకొన్నారు. ఓ ఫోటోను కూడ తన ట్వీట్కు జత చేశారు. బ్రిటిష్ వలస పాలనలో ఇండియా నుండి పెద్ద ఎత్తున నిధులను దోచుకెళ్లారు. ఈ విషయంలో వెబ్సైట్ ప్రచురించిన వార్తాకథనాన్ని జోడిస్తూ ఆ వ్యాఖ్యలు చేశారు.