వడకాశి, స్వామినాథన్ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో... ఆమె బిడ్డ ఆకలితో ఏడ్చాడు.దీంతో కోపంతో ఊగిపోయిన వడాకాశి, స్వామినాథన్... బిడ్డను అతి దారుణంగా కొట్టారు. తీవ్రగాయాలపాలైన ఆ బిడ్డ అక్కడికక్కడే కన్నుమూశాడు.
భర్తను కాదని వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీనికి అడ్డుగా ఉన్నాడని కడుపున పుట్టిన బిడ్డను చంపేసింది. ఈ దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రం నెల్లై జిల్లాలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... తిరువేంకటమ్ తాలుకా పళంగోటైకి చెందిన భాగ్యమ్ కుమారుడు రాజ్(45) విద్యుత్ శాఖ కార్యాలయంలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య వడకాశి(35) సంవత్సరన వయసుగల కొడుకు ఉన్నాడు. కాగా... వడకాశికి ఇటీవల తమ ఇంటికి పాలు పోసే స్వామినాథన్(32) తో పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలుసుకున్న రాజ్ ఇద్దరినీ పలు మార్లు మందలించాడు. అయినా వారిలో మార్పు మాత్రం రాలేదు. వారి వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. ఇటీవల వడకాశి, స్వామినాథన్ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో... ఆమె బిడ్డ ఆకలితో ఏడ్చాడు.
దీంతో కోపంతో ఊగిపోయిన వడాకాశి, స్వామినాథన్... బిడ్డను అతి దారుణంగా కొట్టారు. తీవ్రగాయాలపాలైన ఆ బిడ్డ అక్కడికక్కడే కన్నుమూశాడు. కాగా... మేడపై నుంచి జారి కిందపడ్డాడని... అందుకే చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేయడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 7, 2019, 8:45 AM IST