#మీ టూ ఎఫెక్ట్: మంత్రి పదవికి ఎంజె అక్బర్ రాజీనామా
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పదవికి ఎంజె అక్బర్ బుధవారం నాడు రాజీనామా చేశారు.
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పదవికి ఎంజె అక్బర్ బుధవారం నాడు రాజీనామా చేశారు.కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా ఎంజె అక్బర్ పనిచేస్తున్నారు. # మీటూ ఉద్యమంలో భాగంగా కొందరు మహిళా జర్నలిస్టులు ఎంజె అక్బర్ పై లైంగిక ఆరోపణలు చేశారు.
తమపై ఎంజె అక్బర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మహిళా జర్నలిస్టులు ఆరోపించారు. ఈ ఆరోపణలను అక్బర్ తీవ్రంగా ఖండించారు. తనపై ఆరోపణలు చేసిన మహిళా జర్నలిస్టులపై న్యాయ పోరాటానికి కూడ సిద్దమయ్యాడు. అక్బర్పై 17 మంది మహిళలు ఆరోపణలు చేశారు.
ఈ తరుణంలోనే అక్బర్ బుధవారం నాడు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.తనకు విదేశాంగ సహాయ మంత్రి బాధ్యతలు కట్టబెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్కు ఆయన ధన్వవాదాలు తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కోర్టులో ఈ విషయాన్ని తేల్చుకొనేందుకు వీలుగా తన మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు చెప్పారు.
#MJAkbar resigns from his post of Minister of State External Affairs MEA. pic.twitter.com/dxf4EtFl5P
— ANI (@ANI) October 17, 2018