58 ఏళ్ల మహిళపై 16 ఏళ్ల అబ్బాయి అత్యాచారం.. ప్రైవేట్ పార్టులో కర్ర చొప్పించి.. కొడవలితో నరికి దారుణ హత్య
మధ్యప్రదేశ్లో ఓ మైనర్ బాలుడు 58 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యంత దారుణంగా హతమార్చాడు. ప్రైవేట్ పార్టులో కర్ర చొప్పించి చంపేశాడు. మొబైల్ దొంగిలించాడని రెండేళ్ల క్రితం చేసిన ఆరోపణకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్టు పోలీసులు చెప్పారు. బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. 58 ఏళ్ల వృద్ధురాలిపై 16 ఏళ్ల మైనర్ బాలుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతేకాదు, ఆమె పై తీవ్రంగా దాడి చేశాడు. కొడవలితో నరికి చంపేశాడు. ఈ ఘటన రేవా జిల్లాలో జనవరి 30వ తేదీన జరిగినట్టు పోలీసులు ఆదివారం వెల్లడించారు.
రేవా జిల్లా హనుమానా పోలీసు స్టేషన్ పరిధిలోని కైలాశ్పురి గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆ వృద్ధురాలి నోట్లో ప్లాస్టిక్ బ్యాగ్, వస్త్రాలు కుక్కేశాడు. ఆమె నివసించే చోటు నుంచి నిర్మాణంలో ఉన్న బిల్డింగ్లోకి లాక్కెళ్లాడు. తలపై బాదాడు. కొడవలితో ఇతర శరీర భాగాలపై దాడి చేశాడు. ఆమెను తలుపునకు కట్టేసి కొట్టాడు. ఆమె స్పృహ కోల్పోతుండగా.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండేళ్ల క్రితం ఆ బాలుడు తమ మొబైల్ ఫోన్ దొంగిలించాడని బాధితురాలి కుటుంబం ఆరోపణలు చేసింది. అందుకు ప్రతీకారంగానే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.
అడిషనల్ ఎస్పీ వివేక్ లాల్ ఈ ఘటనపై మాట్లాడుతూ, తమకు ఈ ఘటనకు సంబంధించిన విషయం ఫిబ్రవరి 1వ తేదీన అందిందని వివరించారు. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్లో 58 ఏళ్ల మహిళ మృతదేహం కనిపించిందని తెలిపారు. పోలీసు టీమ్, ఫోరెన్సిక్ టీమ్ స్పాట్కు చేరింది. ఆ మహిళను అత్యంత దారుణంగా హత్య చేసినట్టు కనుగొన్నామని చెప్పారు. స్థానికుల సమాచారం, ఇతర వివరాల ఆధారంగా పొరుగునే ఉండే అబ్బాయిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. మృతురాలి కుటుంబం కూడా ఆ అబ్బాయిపైనే అనుమానాలు వ్యక్తం చేసిందని వివరించారు.
Also Read: చేతిలోనే పేలిన నాటు బాంబు .. రెండు చేతులు పొగొట్టుకున్న గ్యాంగ్స్టర్
రెండేళ్ల క్రితం ఆ అబ్బాయి మృతురాలి ఇంటికి టీవీ చూడటానికి వచ్చేవాడని అధికారులు తెలిపారు. అయితే, ఆ బాలుడు మొబైల్ ఫోన్ దొంగిలించాడని బాధిత కుటుంబం రెండేళ్ల క్రితం ఆరోపణలు చేసిందని, అప్పటి నుంచి ఆ అబ్బాయి అవమాన భారంతో వారి ఇంటి వైపు రావడం లేదని పేర్కొన్నారు. ఈ ఆరోపణతోనే ఆ కుటుంబంపై బాలుడు శత్రుత్వం పెంచుకున్నట్టు తెలిపారు.
జనవరి 30వ తేదీన ఆ మహిళ భర్త, కొడుకు ఊరి బయటకు వెళ్లారు. అదే సమయంలో బాలుడు ఆ ఇంటికి వెళ్లి మంచంలో పడుకుని ఉన్న మహిళపై దాడి చేశాడు. ఆమె అరవడంతో నోట్లో పాలిథీన్ బ్యాగ్, ఇతర వస్త్రాలను కుక్కాడని పోలీసులు చెప్పారు. ఓ తాడు తీసుకుని ప్లాస్టిక్ బ్యాగ్ను ఆమె ముఖానికి కట్టేశాడని, ఆ తర్వాత ఆమెను నిర్మాణం అవుతున్న వైపు తీసుకెళ్లాడని వివరించారు. అక్కడ ఓ డోర్కు ఆమెనుకట్టేసి తీవ్రంగా కొట్టాడు. ఆమె శ్వాస అందక నిశ్చలంగా మారిన తర్వాత రేప్ చేశాడని పేర్కొన్నారు. ఆమె తల, చేతులు, గొంతు, చాతి పై కొడవలితో దాడి చేశాడని, ఆమె ప్రైవేట్ పార్టుల్లో కర్ర చొప్పించినట్టు తెలిపారు. ఆ తర్వాత మహిళ ఇంటిలో ఉన్న రూ. 1000, నగలను పట్టుకుని పారిపోయాడని వివరించారు. ఆ అబ్బాయిని పట్టుకున్నామని, నేరాన్ని అంగీకరించాడని పోలీసులు చెప్పారు.