జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించే వరకు తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ పునరుద్ఘాటించారు. ఇది మూర్ఖపు నిర్ణయమే కావచ్చని, అయితే ఈ సమస్య తనకు ఉద్వేగభరితమైనదని అన్నారు.

ఆర్టికల్ 370కి సంబంధించి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) చీఫ్ , జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఆర్టికల్ 370ని పునరుద్ధరించే వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆమె అన్నారు.ఇది మూర్ఖపు నిర్ణయమే కావచ్చునని, అయితే ఈ సమస్య తనకు ఉద్వేగభరితమైనదని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాష్ట్రంలో రెండు రాజ్యాంగాలు ఉండేవని చెప్పారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వార్తా సంస్థ పిటిఐతో మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ..అధికార బిజెపి ఆర్టికల్ 370 గురించి మాత్రమే మాట్లాడుతుందని, పరిష్కారం కాదని అన్నారు. రాష్ట్ర పునరుద్ధరణ గురించి మాట్లాడాలని తాను బీజేపీని కోరుతున్నానని అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగడం లేదని, ఎందుకంటే ఎన్నికైన ప్రభుత్వం ఏర్పడితే, దాని రహస్య అజెండాను అమలు చేయలేమని కేంద్ర ప్రభుత్వం భయపడుతోందనీ, వారంతా ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రజలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు జమ్మూకశ్మీర్‌లో రెండు రాజ్యాంగాలు ఉండేవని.. ఒకటి భారత్‌, మరొకటి జమ్మూకశ్మీర్‌ అని అన్నారు. ఆ సమయంలో రెండు జెండాలు ఉన్నాయి. కాబట్టి ఇది తనకు భావోద్వేగ సమస్య అన్నారు.

ఇంతకుముందు మెహబూబా ముఫ్తీ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి ప్రకటన ఇస్తూ ఎన్నికలపై తాను ఎలా మాట్లాడగలనని అన్నారు, ఎందుకంటే ఈ నిర్ణయం బిజెపి తీసుకోవలసి ఉంటుంది. ఎన్నికల కమిషన్ కాదు. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారినప్పుడు మాత్రమే ఎన్నికలను నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ఇప్పటికే తెలిపిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అదే సమయంలో, జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖకు సమీపంలో శారదా దేవి ఆలయాన్ని తెరవడాన్ని మెహబూబా ముఫ్తీ స్వాగతించారు. శారదా దేవి ఆలయాన్ని తెరవడం మంచి విషయం. కాశ్మీరీ పండితులు కూడా ఈ ఆలయాన్ని తిరిగి తెరవాలని కోరుకున్నారు. 

మెహబూబా ముప్తీ నిర్ణయంపై రాజకీయ నిపుణులు మాట్లాడుతూ... ఆమె తన మాటకు కట్టుబడి ఉంటే, ఇప్పుడు ఆర్టికల్ 370 తిరిగి రాదని, ఆమె ఎప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేరని అంటున్నారు. ఇంతకు ముందు కూడా మెహబూబా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటనలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.