బాబ్రీ వివాదం: నివేదికకు గడువు కోరిన మధ్యవర్తుల కమిటీ
:రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంపై పూర్తి స్థాయి నివేదికను అందించేందుకు గాను ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ వరకు సమయం ఇవ్వాలని మధ్య వర్తుల కమిటీ సుప్రీం కోర్టును కోరింది.
న్యూఢిల్లీ:రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంపై పూర్తి స్థాయి నివేదికను అందించేందుకు గాను ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ వరకు సమయం ఇవ్వాలని మధ్య వర్తుల కమిటీ సుప్రీం కోర్టును కోరింది. మధ్యవర్తుల కమిటీ ఈ నెల 7వ తేదీన సుప్రీం కోర్టుకు మధ్యవర్తుల కమిటీ నివేదిక అందించింది.
రామ జన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టు శుక్రవారం నాడు విచారణ జరిపింది. మధ్యవర్తుల కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికను ఇచ్చినట్టుగా కోర్టు ప్రకటించింది.
ఈ ఏడాది ఆగష్టు 15వ తేదీ వరకు తమకు సమయం ఇవ్వాలని మధ్యవర్తుల కమిటీ సుప్రీంకోర్టును కోరినట్టుగా సీజేఐ ప్రకటించారు.
ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మాజీ సుప్రీంకోర్టు జడ్జి ఎఫ్ఎం కలీఫుల్లాతో పాటు రవిశంకర్, సీనియర్ అడ్వకేట్ శ్రీరామ్ పంచ్లతో కమిటీ ఏర్పాటు చేశారు.అయోధ్యకు ఇంకా పరిష్కారాన్ని కమిటీ చూపలేదని హిందూ మహాసభ అభిప్రాయపడుతోంది. మధ్య వర్తుల కమిటీకి గడువు పెంచడాన్ని ముస్లింలు స్వాగతించారు.