Asianet News TeluguAsianet News Telugu

కారుణ్య నియమకాల్లో వివాహిత కుమార్తెకు కూడా సమాన హక్కు.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుమారులు, వివాహిత కుమార్తెల మాదిరిగానే కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగం పొందేందుకు సమాన హక్కు ఉండేలా నిబంధనలను సవరించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Married daughter to have equal right to get job on compassionate grounds in Madhya Pradesh
Author
First Published Feb 8, 2023, 3:46 AM IST

మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ ప్రభుత్వం మహిళల ప్రయోజనాల  కోసం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశంలో మహిళలకు అనుకూలంగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో కారుణ్య నియామకాల్లో వివాహిత కుమార్తె కూడా సమాన అవకాశం కల్పిస్తూ.. గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు లేదా అధికారులు మరణిస్తే.. వారికి సంబంధించిన కారుణ్య నియామకాల్లో ఇప్పటి వరకు కుమారులు మాత్రమే అర్హులని వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ తెలిపారు. ఇందులో పెళ్లయిన కుమార్తెకు అర్హత లేదని, ఇప్పుడు కుమారులతో పాటు కుమార్తెలు కూడా ఇందులో అర్హులని.. చనిపోయిన అధికారి ఉద్యోగి కుమార్తెకు కారుణ్య నియామకం అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

కారుణ్య ప్రాతిపదికన నియామకం పొందేందుకు కొడుకుల మాదిరిగానే వివాహిత కుమార్తెలకు కూడా సమాన హక్కు ఉంటుందని మంత్రివర్గం నిర్ణయించిందని వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్  అన్నారు. నిబంధనలకు అవసరమైన సవరణలు చేయాలని సాధారణ పరిపాలన శాఖను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

ఈ మేరకు ఆర్థిక, గణాంక శాఖలో పని చేస్తూ మరణించిన ఆర్యస్ రాథోడ్.. వివాహిత కుమార్తె శ్రద్ధా మాల్వికి రాష్ట్ర ప్రభుత్వం కారుణ్య నియామకం ఇస్తుంది.పెళ్లయిన కుమార్తెకు కారుణ్య నియామకం జరగడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఈ ఏడాది ప్రారంభంలో ఎంపీ హైకోర్టులోని ఇండోర్ బెంచ్ మరణించిన ఉద్యోగి వివాహిత కుమార్తెకు ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కోర్టు తీర్పును ఉటంకిస్తూ దీన్ని అధికారిక విధానంగా మార్చాలని మంగళవారం మంత్రివర్గం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. శ్రీ సారంగ్ ఈ నిర్ణయం మహిళా సాధికారతకు సుదూర పరిణామాలను కలిగిస్తుందని అన్నారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ మంత్రివర్గంలో పెద్ద నిర్ణయం తీసుకోవడంతో.. వివాహిత కుమార్తెకు కూడా కారుణ్య నియామకానికి అర్హత లభించింది.

పేదలకు ఇళ్ల స్థలాలు 

అక్రమ ఆక్రమణల నుంచి విముక్తి పొందిన భూమిలో పట్టణ ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. డెవలపర్‌కు భూమి ఇస్తామని, అతను కొంత భాగం వాణిజ్య కార్యకలాపాలు చేస్తాడు. ఇళ్లు లేని వారికి క్రాస్ సబ్సిడీ ద్వారా పేదలకు ఇళ్లు అందజేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో భవనాలు నిర్మించలేకపోతే అక్కడ స్థలం ఇస్తారని తెలిపారు.

 పశువుల అందజేత

సహరియా, బైగా, భరియా తెగల ప్రజలకు ప్రభుత్వం రెండు పాల జంతువులను ఇవ్వాలని శివరాజ్ ప్రభుత్వం నిర్ణయించింది. పాలు, ఆవు పేడ, ఆవు మూత్రం మార్కెట్‌లో అనుసంధానం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేయనున్నారు. మొదటి దశలో 1500 మందిని ఎంపిక చేసి పథకానికి అమలు చేయనున్నారు.

దీని కోసం 10% మాత్రమే చెల్లించాలి. దీనితో పాటు ప్రభుత్వం 90% మొత్తాన్ని గ్రాంట్‌గా అందిస్తుంది. గతంలో ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఆక్రమణల నుంచి విముక్తి కల్పించే పథకం సూరజ్ నీతి-2023కి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios