లాయర్ చాంబర్లో కూడా దండలు మార్చుకుని పెళ్లి చేసుకోవచ్చు: సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. లాయర్ చాంబర్లోనైనా పెళ్లి చేసుకోవచ్చని వివరించింది. పూల దండలు మార్చుకుని, ఉంగరం తొడిగించి, తాళి కట్టి పెళ్లి చేయవచ్చని తెలిపింది. మద్రాస్ హైకోర్టు 2014లో ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సోమవారం కీలక రూలింగ్ ఇచ్చింది. అడ్వకేట్ చాంబర్లో కూడా ఒక జంట పూల దండలు మార్చుకుని లేదా చేతి వేలికి ఉంగరం తొడిగించి లేదా తాళి కట్టి పెళ్లి చేసుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. హిందూ చట్టంలోని సెక్షన్స్ 7, 7-ఏ ప్రకారం కొంత మంది అపరిచితుల నడుమ రహస్యంగా చేసుకున్న పెళ్లి చెల్లదని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
న్యాయమూర్తులు ఎస్ రవీంద్ర భట్, అరవింద్ కుమార్ల ధర్మాసనం మద్రాస్ హైకోర్టును తోసిపుచ్చుతూ కోర్టు ఆఫీసర్లుగా కాకుండా మిత్రులు/బంధువులు/సామాజిక కార్యకర్తల కెపాసిటీలో లాయర్లు పెళ్లి చేయవచ్చు. హిందూ మ్యారేజీ యాక్ట్ సెక్షన్ 7(ఏ) (తమిళనాడు రాష్ట్ర సవరణ చట్టం) కింద ఈ పెళ్లి చేయవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.
Also Read: స్టీల్ ప్లాంట్ కోసం కేఏ పాల్ ఆమరణ నిరాహార దీక్ష.. ‘10 లక్షల ఉద్యోగాలిప్పిస్తా’
ఇద్దరు హిందువులు బంధువులు, మిత్రులు, లేదా ఇతరుల సమక్షంలో చేసుకునే పెళ్లికి సెక్షన్ 7 - ఏ వర్తిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం వివరించింది. ఈ సెక్షన్లో కీలకమైనదేమిటంటే.. పురోహితుడు లేకున్నా చెల్లుబాటు అయ్యే వివాహం అని తెలిపింది.