ప్రజా దర్భార్లో యువకులకు వార్నింగ్: ఛత్తీస్ఘడ్లో ఏడుగురిని విడుదల చేసిన మావోలు
ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో కిడ్నాప్ చేసిన ఏడుగురు యువకులను మావోయిస్టులు వదిలివేశారు. ఈ నెల 18వ తేదీన వారిని మావోలు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ గురైన యువకులను ప్రజా దర్భార్ లో విచారణ నిర్వహించి వదిలేశారు.
రాయ్పూర్: ఈ నెల 18వ తేదీన ఏడుగురు యువకులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు మొదటి తప్పుగా భావించి యువకులను వదిలివేశారు.రాష్ట్రంలోని సుక్మా జిల్లాలోని జేగురుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుందేడ్ గ్రామానికి చెందిన ఏడుగురు యువకులు ఈ నెల 18వ మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఏడుగురు యువకులను వెతికేందుకు వెళ్లిన నలుగురు గ్రామస్తులు కూడ అదృశ్యమయ్యారు.
also read:ఛత్తీస్ఘడ్లో ఏడుగురిని కిడ్నాప్ చేసిన మావోలు: వెతికేందుకు వెళ్లిన నలుగురు గ్రామస్తుల అదృశ్యం
దీంతో గ్రామస్థులు ఆందోళన చెందారు. పోలీసులు కూడ వారి కోసం వెతికారు.ఈ ఏడుగురు యువకులు పోలీసులకు ఇన్ ఫార్మర్లుగా పనిచేస్తున్నారని మావోయిస్టులు ఆరోపించారు. ప్రజా దర్భార్ నిర్వహించారు. తొలి తప్పు కింద ఈ ఏడుగురు యువకులను మావోయిస్టులు వదిలివేశారు. భవిష్యత్తులో ఈ తప్పులు చేయవద్దని కూడ మావోయిస్టులు యువకులను హెచ్చరించారు. ఈ విషయాన్ని మావోయిస్టుల ప్రతినిధి మీడియాకు తెలిపినట్టుగా ఛత్తీస్ ఘడ్ స్థానిక మీడియా ప్రకటించింది. ఏడుగురు యువకులు సురక్షితంగా రావడంతో కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.