Asianet News TeluguAsianet News Telugu

మంగళూరులో కదులుతున్న ఆటోలో పేలుడు: ప్రధాన నిందితుడిని గుర్తించిన పోలీసులు.. గతంలో ఉపా చట్టం కింద కేసు 

కర్ణాటకలోని మంగళూరులో శనివారం కదులుతున్న ఆటో రిక్షాలో పేలుడు సంభవించిన ఘటనలో మహ్మద్ షరీఖ్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. షరీక్‌పై గతంలో మంగళూరులో గోడలపై గ్రాఫిటీ చేసినందుకు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదైంది. ఈ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చాడు. అప్పటి నుంచి మహ్మద్ షరీఖ్  పరారీలో ఉన్నాడు. అతడు పోలీసుల కోసం గాలిస్తున్నాడు.

Mangaluru blast suspect identified, accused was previously booked under UAPA
Author
First Published Nov 20, 2022, 6:12 PM IST

కర్ణాటకలోని మంగళూరులో శనివారం కదులుతున్న ఆటో రిక్షాలో పేలుడు సంభవించిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌, ప్రయాణికుడికి గాయాలయ్యాయి. పేలుడు కేసులో మహ్మద్ షరీఖ్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. షరీక్‌పై గతంలో మంగళూరులో గోడలపై గ్రాఫిటీ చేసినందుకు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదైంది. అయితే..ఈ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన  షరీక్‌ పరారీలో ఉన్నాడు. ఉగ్రదాడి కేసులో పరారీలో ఉన్న అతడి కోసం  పోలీసులు గాలిస్తున్నాడు. 

మరో వైపు.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో భద్రావతికి చెందిన మాజ్, యాసిన్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి ఇంట్లో నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరు నిందితులు మహ్మద్ షరీక్ కోసం పనిచేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు . ఈ కేసులో విచారణ కోసం అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. శనివారం జరిగిన ఈ పేలుడులో ఆటో డ్రైవర్‌తో పాటు షరీక్‌ గాయపడ్డారు. 40 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం కంకనాడిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

షారిక్ ఇంటి నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం

మంగళూరు పేలుళ్ల కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ విభాగం (ఎఫ్‌ఎస్‌ఎల్) బృందం ఆదివారం మైసూర్‌లో షరీక్ అద్దెకు తీసుకున్న ఇంటికి చేరుకుంది. షారిక్ నివాసం నుంచి పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగించే పదార్థాలను బృందం స్వాధీనం చేసుకుంది. అతని ఇంటి నుంచి జెలటిన్ పౌడర్, సర్క్యూట్ బోర్డ్, చిన్న బోల్ట్‌లు, బ్యాటరీలు, మొబైల్, కలప శక్తి, అల్యూమినియం మల్టీ మీటర్లు, వైర్లు, మిక్స్‌డ్ జార్లు, ప్రెజర్ కుక్కర్ మొదలైన పేలుడు పదార్థాలను ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం స్వాధీనం చేసుకుంది. దర్యాప్తు అధికారులు ఒక మొబైల్ ఫోన్, రెండు నకిలీ ఆధార్ కార్డులు, ఒక నకిలీ పాన్ కార్డ్ ,ఒక FINO డెబిట్ కార్డును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తన ఇంట్లో పేలుడు పదార్థాలను తయారు చేస్తున్నట్టు గుర్తించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios