దేశ అత్యున్నత న్యాయస్ధానం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఓ వ్యక్తి చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో అక్కడ కలకలం రేగింది.

దేశ అత్యున్నత న్యాయస్ధానం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఓ వ్యక్తి చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో అక్కడ కలకలం రేగింది. శుక్రవారం ఉదయం కోర్టు కార్యకలాపాలు సాగుతుండగా ఓ వ్యక్తి లోపలికి వచ్చాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

అక్కడ న్యాయవాదులు, కక్షిదారులు ఉండగానే ఎడమచేతిని కోసుకున్నాడు. దీంతో అక్కడున్న సిబ్బంది అతడిని రక్షించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతని చేతికి రుమాలు చుట్టి ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తి ఎవరు.. ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .