దూరం పెట్టిందని ప్రేయసిని పాయింట్ బ్లాంక్ రేంజ్ కాల్చి.. పారిపోతుండగా ట్విస్ట్...
తుపాకీతో ప్రేయసి మీద కాల్పులు జరిపి ప్రాణాలు తీసిన ఓ ఉన్మాది అక్కడినుంచి పారిపోతూ ట్రాక్టర్ ఢీకొని చనిపోయాడు. మహారాష్ట్రలోని ఘటన చోటు చేసుకుంది.
ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన ఓ ఘటన తాలూకు వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతుంది. ప్రియురాలితో గొడవ కారణంగా ఆమెను అంతమొందించాలనుకున్నాడు ప్రియుడు. అనుకున్నట్లే తుపాకీ తెచ్చి ఆమెను వెనుకనుంచి కాల్చాడు. దాంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. ఆ తర్వాత అదే తుపాకీతో కాల్చుకుని సూసైడ్ ప్రయత్నించాడు. కానీ, ఆ తుపాకి పేలకకపోవడంతో అక్కడి నుంచి పారిపోయే క్రమంలో.. చాలా సినిమాల్లో చూపించినట్లు మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.
కృష్ణ యాదవ్ అనే వ్యక్తి నేహ అనే యువతిని ప్రేమించాడు. అయితే, వారి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. బుధవారం మధ్యాహ్నం భోగి సర్ లోని రైల్వే ఫ్లైఓవర్ కింద ఉన్న నేహా మీద కృష్ణ యాదవ్ తుపాకీతో గురిపెట్టాడు. తలపై కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. నిందితుడు ఆ వెంటనే అక్కడి నుంచి పారిపోతుండగా మొదట ఓ కారు ఢీకొట్టింది. అయినా సరే దాన్ని తప్పించుకుని పరుగు పరుగున ఇంకా ముందుకు వెళ్తుండగా ఆర్మీకి చెందిన ఓట్లు ఎదురుగా వచ్చి అతడిని ఢీకొట్టింది గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా… చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు
ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికలు: పోటీ నుండి తప్పుకున్న దిగ్విజయ్ సింగ్
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబైలోని బొయిసర్ ప్రాంతానికి చెందిన శ్రీకృష్ణ యాదవ్, నేహా మహా గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, ఇటీవల నేహాతో శ్రీకృష్ణ ప్రతి చిన్న విషయానికి వాగ్వాదానికి దిగుతున్నాడు. దీంతో అతడిని ఆమె దూరం పెట్టింది. దీన్ని మనసులో పెట్టుకున్న శ్రీకృష్ణ ప్రేయసిని చంపాలని నిర్ణయించుకున్నాడు. నేహా రోజు ఇంటి నుంచి బయటికి వెళ్లే టిఐఎంఏ ఆస్పత్రి దారిలో ఆమె కోసం కాపు కాచాడు. నేహా వచ్చిన తర్వాత.. మరోసారి వాగ్వాదానికి దిగిన శ్రీకృష్ణ.. తనతో పాటు తెచ్చుకున్న తుపాకీతో ఆమెను పాయింట్ బ్లాంక్ రేంజిలో షూట్ చేశాడు. ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది.
అయితే, ఆ తర్వాత అదే తుపాకితో తాను కాల్చుకుని చనిపోవాలని ప్రయత్నించాడు. కానీ, అది పేలకపోవడంతో ఘటనా స్థలం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొట్టడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు శ్రీకృష్ణను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను చనిపోయినట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సిసిటివి కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియో కాస్త బయటకు రావడంతో ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతుంది.