ముంబయిలో దారుణం... భార్యను రైలు కిందకు తోసేసిన భర్త
ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో సమీపంలో ఓ వ్యక్తి తన భార్యను వేగంగా వస్తున్న రైలు ముందుకు తోసేశాడు. ఈ ఘటనలో బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది.
మహారాష్ట్ర: భార్యాభర్తల మధ్య గొడవలు సర్వసాధారణం. అయితే, ఇటీవలి కాలంలో కొంతమంది ఈ గొడవలను సీరియస్ గా తీసుకుని వారి ప్రాణాలు తీసుకోవడమే.. లేదా అవతలి వారి ప్రాణాలు తీయడం వంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఇదే తరహాలో ఓ వ్యక్తి తన భార్యను వేగంగా వస్తున్న రైలు కిందకు తోశాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోంది. ఈ ఘటన అంత అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబయికి సమీపంలోని రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని వసాయి రోడ్ రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి తన భార్యను కదులుతున్న రైలు ముందుకి తోసి హత్య చేశాడు. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడు తన భార్యను రైలు పట్టాలపైకి లాగడం కనిపించింది. ప్లాట్ఫారమ్పై ఇద్దరు పిల్లలతో కలిసి నిద్రిస్తున్న మహిళను ఆమె భర్త ట్రాక్పైకి నెట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని వాసాయ్ రోడ్ రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి తన భార్యను కదులుతున్న రైలు ముందుకి తోసి చంపిన ఘటన సంచలనంగా మారింది. సీసీటీవీ ఫుటేజీ ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. అక్కడ నిందితుడు తన భార్యను రైలు పట్టాలపైకి లాగడం వీడియో దృశ్యాల్లో కనిపించింది. వేగంగా వెళుతున్న రైలు స్పాట్ దాటడానికి క్షణాల ముందు ఈ ఘటన జరిగింది.
తెల్లవారుజామున 4:10 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలోని సీసీటీవీ ఫుటేజీలో ఆ వ్యక్తి తన 30 ఏళ్ల వయసు ఉన్న నిద్రిస్తున్న భార్యను నిద్రలేపి, రైల్వే ప్లాట్ఫాం అంచుకు ఈడ్చుకెళ్లి, ఎక్స్ప్రెస్ మార్గంలో పట్టాలపైకి నెట్టడం స్పష్టంగా కనిపిస్తున్నదని ఓ రైల్వే అధికారి చెప్పారు. 5వ నంబర్ ప్లాట్ఫారమ్పై మహిళ తన ఇద్దరు పిల్లలతో నిద్రిస్తుండగా, ఆమె భర్త ఆమెను రైలు పట్టాలపైకి ఈడ్చుకెళ్లి, అవధ్ ఎక్స్ప్రెస్ ముందు ఆమెను తోసి చంపాడని రైల్వే అసిస్టెంట్ కమిషనర్ భాజీరావ్ మహాజన్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని తెలిపారు. ఈ ఘటన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడు తన ఇద్దరు పిల్లలను బ్యాక్ప్యాక్తో ఎత్తుకుని ప్లాట్ఫారమ్ నుండి పారిపోతున్నట్లు చూపుతున్నట్లు అధికారి తెలిపారు.
ఆ వ్యక్తి తర్వాత దాదర్కు, ఆ తర్వాత కళ్యాణ్కు రైలు ఎక్కుతున్నట్లు గుర్తించారు. అతను ఈ రెండు రైల్వే స్టేషన్లలో కనిపించాడని, అతన్ని పట్టుకోవడానికి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు రైల్వే అసిస్టెంట్ కమిషనర్ భాజీరావ్ మహాజన్ చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్యాభర్తలకు మధ్య గతంలో గొడవలు జరిగాయి. ఈ ఘటన జరిగిన రోజు కూడా భార్యభర్తల మధ్య మాటలయుద్ధం జరిగినట్టు సమాచారం. ఆ తర్వాత తమ పిల్లలతో కలిసి ప్లాట్ఫాంపై నిద్రిస్తున్న సమయంలో నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. IPC సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదుచేసినట్టు అధికారులు తెలిపారు.
శృంగారానికి నిరాకరించిందని..
బెంగళూరులో నివాసం ఉండే ఓ వ్యక్తి తన భార్య తనతో సెక్స్ను నిరాకరించిందని ఆరోపిస్తూ హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని షిరాడీ ఘాట్లో పడేశాడు. పోలీసుల నుండి తప్పించుకోవడానికి, తన భార్య కనిపించకుండా పోయిందని మరో కట్టుకథతో పోలీసులను ఆశ్రయించాడు. విచారణలో భర్తనే ఆమెను హత్య చేశాడని గుర్తించారు. వివరాల్లోకెళ్తే.. బెంగుళూరులో నివసించే బీహార్కు చెందిన ఓ ఎలక్ట్రీషియన్ తన భార్య తనతో లైంగిక సంబంధం నిరాకరించిందని ఆరోపిస్తూ ఆమెను హత్య చేశాడు. మృతదేహాన్ని షిరాడీ ఘాట్లో పడేశాడు. అనంతరం తన భార్య కనిపించకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.