ప్రియురాలిని చంపి.. ఐదుగంటలు శవాన్ని నగ్నంగా...
వీరిద్దరూ సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా... ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో.. వారిద్దరూ ఇంట్లోనే ఉంటున్నారు.
ఓ వ్యక్తి తాను ప్రేమించిన ప్రియురాలిని అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఆమె శవాన్ని తన పక్కనే పెట్టుకొని ఐదు గంటలపాటు పడుకున్నాడు. ఈ దారుణ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని కంజావాలా జిల్లాకు చెందిన వ్యక్తి(34) ఓ యువతి(30) లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాడు. కాగా.. వీరిద్దరూ సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా... ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో.. వారిద్దరూ ఇంట్లోనే ఉంటున్నారు.
రెండు నెలలుగా కనీసం ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేదు. కాగా... శుక్రవారం తన ప్రియురాలిని అతి కిరాతకంగా హత్య చేశాడు. హత్యకు ముందు యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. ఆమెను చంపేసి.. శవాన్ని దాదాపు ఐదు గంటలపాటు పక్కనే పెట్టుకొని పడుకోవడం గమనార్హం. కాగా.. ఆమె శవం పై నూలు పోగు కూడా లేకపోవడం గమనార్హం.
కాగా.. సమచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి నిందితుడిని అరెస్టు చేశారు. కాగా... హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించడం గమనార్హం.