ఒక్క వజ్రం.. లక్షాధికారిగా మారిన కూలీ..!
గనుల్లో పనిచేసే ఓ కూలీని వజ్రం రూపంలో అదృష్టం వరించడంతో లక్షాధికారిగా మారిపోయాడు. వజ్రాల గనిగా ప్రసిద్ధి గాంచిన మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లాలో.. ఈ ఘటన చోటుచేసుకుంది
ఒక్క వజ్రం... ఓ కూలీని లక్షాధికారిగా మార్చింది. గనుల్లో పనులు చేస్తుండగా.. ఓ కూలీకి వజ్రం దొరికింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: దారుణం.. సరదా కోసం మలద్వారం గుండా గాలిని శరీరంలోకి పంపి.. చంపేశారు...!
గనుల్లో పనిచేసే ఓ కూలీని వజ్రం రూపంలో అదృష్టం వరించడంతో లక్షాధికారిగా మారిపోయాడు. వజ్రాల గనిగా ప్రసిద్ధి గాంచిన మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లాలో.. ఈ ఘటన చోటుచేసుకుంది. పన్నాలోని హీరాపూర్ తపరియన్ ప్రాంతం గనుల్లో పని చేసే శంశేర్ ఖాన్ కు ఈ వజ్రం లభించింది. 6 క్యారెట్ల 66 సెంట్ల బరువు ఉన్న దాని ధర రూ.20లక్షలు ఉంటుందని అక్కడి వారు అంచనా చేస్తున్నారు. ఈ వజ్రాన్ని వేలం వేసేందుకు అతను ప్రభుత్వ అధికారులకు అప్పగించారు. కాగా.. అతనిని అదృష్టం వరించిందని నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Also Read: మహారాష్ట్రలో మార్చికల్లా బీజేపీ ప్రభుత్వం.. కొన్ని విషయాలు రహస్యంగానే ఉంచాలి: కేంద్ర మంత్రి సంచలనం