Asianet News TeluguAsianet News Telugu

ఒక్క వజ్రం.. లక్షాధికారిగా మారిన కూలీ..!

గనుల్లో పనిచేసే ఓ కూలీని వజ్రం రూపంలో అదృష్టం వరించడంతో లక్షాధికారిగా మారిపోయాడు. వజ్రాల గనిగా ప్రసిద్ధి గాంచిన మధ్యప్రదేశ్  రాష్ట్రం పన్నా జిల్లాలో.. ఈ ఘటన చోటుచేసుకుంది

Man Found Diamond In Madhya Pradesh
Author
Hyderabad, First Published Nov 27, 2021, 9:32 AM IST

ఒక్క వజ్రం... ఓ కూలీని లక్షాధికారిగా మార్చింది.  గనుల్లో పనులు చేస్తుండగా.. ఓ కూలీకి  వజ్రం దొరికింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్  రాష్ట్రం పన్నా జిల్లాలో చోటుచేసుకోగా..  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: దారుణం.. సరదా కోసం మలద్వారం గుండా గాలిని శరీరంలోకి పంపి.. చంపేశారు...!

గనుల్లో పనిచేసే ఓ కూలీని వజ్రం రూపంలో అదృష్టం వరించడంతో లక్షాధికారిగా మారిపోయాడు. వజ్రాల గనిగా ప్రసిద్ధి గాంచిన మధ్యప్రదేశ్  రాష్ట్రం పన్నా జిల్లాలో.. ఈ ఘటన చోటుచేసుకుంది. పన్నాలోని హీరాపూర్ తపరియన్  ప్రాంతం గనుల్లో పని చేసే  శంశేర్ ఖాన్ కు ఈ వజ్రం లభించింది. 6 క్యారెట్ల 66 సెంట్ల బరువు ఉన్న దాని ధర రూ.20లక్షలు ఉంటుందని అక్కడి వారు అంచనా చేస్తున్నారు. ఈ వజ్రాన్ని వేలం వేసేందుకు అతను ప్రభుత్వ అధికారులకు అప్పగించారు.  కాగా.. అతనిని అదృష్టం వరించిందని నెటిజన్లు  శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also Read: మహారాష్ట్రలో మార్చికల్లా బీజేపీ ప్రభుత్వం.. కొన్ని విషయాలు రహస్యంగానే ఉంచాలి: కేంద్ర మంత్రి సంచలనం

Follow Us:
Download App:
  • android
  • ios