వార్నీ... రాజకుటుంబం పేరుతో రూ. 23 లక్షల హోటల్ బిల్లుకు కుచ్చుటోపీ..!!
ఆగస్టులో హోటల్కు వచ్చినప్పుడు, షరీఫ్ తాను యుఎఇ నివాసి అని, అబుదాబి రాజకుటుంబానికి చెందిన షేక్ ఫలాహ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో కలిసి పనిచేశానని సిబ్బందికి చెప్పాడు.
న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఓ విలాసవంతమైన హోటల్లో నాలుగు నెలల పాటు బస చేసేందుకు అబుదాబి రాజకుటుంబానికి చెందిన ఉద్యోగిగా నటిస్తూ ఓ వ్యక్తి రూ. 23 లక్షల బిల్లును ఎగ్గొట్టి అదృశ్యమయ్యాడు. శనివారం లీలా ప్యాలెస్ హోటల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు మోసం, దొంగతనాలకు పాల్పడిన మహ్మద్ షరీఫ్ కోసం ఢిల్లీ పోలీసులు వెతుకుతున్నారు.
షరీఫ్ ఆగస్ట్ 1న లీలా ప్యాలెస్లోని 427వ గదిలో దిగాడు. నవంబర్ 20న గప్ చుప్ గా మాయమయ్యాడు. అతను పారిపోయిన విషయాన్ని గమనించిన హోటల్ సిబ్బంది అతను గదిలో వెతకగా.. గదిలోని వెండి పాత్రలు, ముత్యాల ట్రేతో సహా అనేక వస్తువులను దొంగిలించాడని కనిపెట్టారు.
భారత్ జోడో యాత్రలో భద్రత లోపం.. రాహుల్ గాంధీ వద్దకు దూసుకెళ్లిన వ్యక్తి..
ఆగస్టులో హోటల్ కు వచ్చినప్పుడు, షరీఫ్ తాను యుఎఇ నివాసి అని చెప్పుకున్నాడు. అంతేకాదు అబుదాబి రాజకుటుంబానికి చెందిన షేక్ ఫలాహ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో కలిసి పనిచేశానని సిబ్బందికి తెలిపారు. తాను వ్యక్తిగతంగా షేక్తో కలిసి పనిచేశానని, అధికారిక పనిపై భారత్ కి వచ్చానని చెప్పాడు. తాను చెప్పేది నమ్మించడానికి ఒక బిజినెస్ కార్డ్, యూఏఈ రెసిడెంట్ కార్డ్, ఇతర పత్రాలను కూడా వారికి ఇచ్చాడు. అంతేకాదు, తాను చెప్పేది నిజం అని హోటల్ సిబ్బందిని నమ్మించడానికి కాజువల్ గా వారితో చాట్ చేస్తున్నట్లుగా చేస్తూ.. యూఏఈలో తన లైఫ్ స్టైల్ గురించి మాట్లాడే వాడు.
అయితే, అతను సమర్పించిన పత్రాలు నకిలీవిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ పత్రాలను పూర్తిగా తనిఖీ చేస్తున్నారు. నాలుగు నెలల పాటు హోటల్ గదిలో బస చేసినందుకు, రెంట్, మిగతా సేవలకు మొత్తం రూ. 35 లక్షలు బిల్ అయ్యింది. అతను రూ. 11.5 లక్షలు చెల్లించి మిగిలిన సొమ్ము చెల్లించకుండా వెళ్లిపోయాడు. అతను హోటల్ నుండి పారిపోయిన రోజు నవంబర్ 20 నాటికి రూ. 20 లక్షల చెక్కును సిబ్బందికి ఇచ్చాడు. ఆ వ్యక్తిని గుర్తించేందుకు ఢిల్లీ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.