Asianet News TeluguAsianet News Telugu

విషాదం : కాబోయే వరుడ్ని కాటికి పంపిన కరోనా.. ఆస్పత్రిలో బెడ్డు దొరకక మృతి !

కరోనా విలయతాండవం చేస్తోంది. కనిపించిన వారిని కనిపించినట్టే కాటికి పంపేస్తుంది. తాజాగా కర్ణాటక లో ఘోరవిషాదం చోటు చేసుకుంది. కొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు కరోనా కాటుతో చితిమీదికి ఎక్కాల్సి వచ్చింది.

Man Deceased Of Covid 19 Karnataka Over Beds Scarcity - bsb
Author
Hyderabad, First Published Apr 28, 2021, 10:38 AM IST

కరోనా విలయతాండవం చేస్తోంది. కనిపించిన వారిని కనిపించినట్టే కాటికి పంపేస్తుంది. తాజాగా కర్ణాటక లో ఘోరవిషాదం చోటు చేసుకుంది. కొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు కరోనా కాటుతో చితిమీదికి ఎక్కాల్సి వచ్చింది.

కర్ణాటకలోని తుమకూరులో కొద్ది రోజుల్లో పెళ్లి కాబోతున్న యువకుడికి కరోనా సోకింది. దీంతో అతను చికిత్స తీసుకుంటూ చనిపోయాడు. సదరు యువకుడు మొబైల్‌షాపులో పనిచేస్తున్నాడు. అతని స్వస్థలం తుమకూరు జిల్లాలోని చిక్కనాయకనహళ్లి తాలూకా హాలుకట్టి గొల్లరహట్టి.

తెలంగాణలో కరోనాది అదే జోరు: ఒక్క రోజులో 8,061 కేసులు, 56 మంది మృతి...

ఇతనికి ఇటీవలే పెళ్లి నిశ్చయమయ్యింది. మూడు రోజుల కిందట అనారోగ్యంగా ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. ఇందులో పాజిటివ్ అని తేలింది.  వెంటనే జిల్లా ఆస్పత్రికి వెళ్లగ అక్కడ బెడ్లు ఖాళీ లేవన్నారు. 

తిపటూరుకు వెళ్లగా  అక్కడ కూడా చేర్చుకోలేదు. ఈ క్రమంలో హాసన్ జిల్లా ఆస్పత్రిలో చేర్చేందుకు తీసుకువెళ్తుండగా మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశాడు. తుమకూరులోనే వైద్యం చేసి ఉంటే బతికేవాడు, పెళ్లికొడుకు కావాల్సినవాడు శ్మశానానికి వెళ్లావా నాన్నా అంటూ తల్లిదండ్రులు భోరున విలపించారు. వారు రోదిస్తున్న తీరు అందరిచేత కంటతడి పెట్టించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios