మహారాష్ట్రలోని లాతూర్‌లో రెండేళ్లుగా 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడుతూ.. ఆమె పారిపోయి వచ్చేలా ప్రేరేపించిన యువకుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

మహారాష్ట్ర : మహారాష్ట్రలోని లాతూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి రెండేళ్లుగా 11 ఏళ్ల బాలిక మీద  అత్యాచారం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెను ఇంటినుంచి లాతూర్ పారిపోయి వచ్చేలా చేశాడు. ఆ  యువకుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మొదట్లో వీరిద్దరికీ ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. తరువాతి క్రమంలో బాలికను పదకం ప్రకారం ట్రాప్ చేసి.. ఆమెను తనకోసం లాతూర్ వచ్చేట్టుగా చేశాడు.

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో బాలిక తప్పిపోయినట్లు తేలడంతో ఈ సంఘటన తెరపైకి వచ్చింది. ఆమె ఎక్కడుందోనని కంగారుపడిన కుటుంబీకులు.. ఆమెకోసం సోదాలు నిర్వహించగా ఆమె గదిలో రెండు మొబైల్ నంబర్లు కనిపించాయి.

పార్టీలో మహిళపై కత్తితో దాడి.. టెర్రస్ పై రక్తపు మడుగులో శవంగా....

ఒక నంబర్‌ కు కాల్ చేయగా, ఒక యువకుడు సమాధానం ఇచ్చాడు. తనను తాను హైదరాబాద్‌ షేక్‌గా చెప్పుకున్నాడు. మైనర్ బాలిక తనతోనే ఉందని పేర్కొన్నాడు. అంతేకాదు ఆమె ఇంటికి తిరిగి రాదని, తమ కూతురి గురించి మరచిపోమని వారిని గట్టిగా హెచ్చరించాడు.

దీంతో వారు పోలీసులకు ఆశ్రయించడంతో.. అతనిపై కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు అతని మొబైల్ నంబర్ ద్వారా లొకేషన్‌ను గుర్తించారు. మహారాష్ట్రలోని లాతూర్‌లో అనుమానితుడిని కనుగొని, మైనర్‌ను అక్కడ నుండి విజయవంతంగా స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిని లాతూర్‌లోని ఔరద్ షాజనీ ప్రాంతానికి చెందిన మనుద్దీన్ బాదురేగా గుర్తించారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి ట్రాన్సిట్ రిమాండ్ కింద గోరఖ్‌పూర్‌కు తరలించారు. లాతూర్‌లో ఆమెను బంధించడానికి ముందు నిందితుడు గోరఖ్‌పూర్‌లో నివసించేవాడని పోలీసుల విచారణలో తేలింది. రెండేళ్లుగా మైనర్‌పై అత్యాచారం చేస్తున్నాడు. పర్యవసానంగా, పోలీసులు అత్యాచారం, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద అభియోగాలు మోపారు.