ఐదేళ్ల చిన్నారిపై అత్యంత పాశవికంగా అత్యాచారం.. 35యేళ్ల వ్యక్తి అరెస్ట్...
ఈ దారుణమైన ఘటన ఆదివారం జరిగింది. ఆ తరువాత నిందితుడు పరారీలో ఉన్నాడు. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడి కోసం నాలుగు బృందాలుగా విడిపోయి గాలించామని ఎస్పీ కేవీ సింగ్ తెలిపారు. ఎట్టకేలకు జిల్లాలోని ఓ ఇంట్లో దాక్కున్న అతడిని పట్టుకున్నట్లు సింగ్ తెలిపారు.
ఒడిశా : ఐదేళ్ల చిన్నారిపై molestationనికి పాల్పడ్డ కామాంధుడిని ఎట్టకేలకు పోలీసులు గురువారం arrest చేశారు. 35యేళ్ల ఆ వ్యక్తి ఐదేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి ఇంటి డాబాపైకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు.
ఘటన తరువాత నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు 35 ఏళ్ల ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీనియర్ అధికారి తెలిపారు. నిందితుడిని జగత్సింగ్పూర్కు చెందిన Mahesh Mohantyగా గుర్తించారు. మొహంతికి గతంలో కూడా criminal antecedents ఉంది. అతను ఇటీవల jail నుండి విడుదలయ్యాడు.
ఈ దారుణమైన ఘటన ఆదివారం జరిగింది. ఆ తరువాత నిందితుడు పరారీలో ఉన్నాడు. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడి కోసం నాలుగు బృందాలుగా విడిపోయి గాలించామని ఎస్పీ కేవీ సింగ్ తెలిపారు. ఎట్టకేలకు జిల్లాలోని ఓ ఇంట్లో దాక్కున్న అతడిని పట్టుకున్నట్లు సింగ్ తెలిపారు.
బాధిత చిన్నారిని కటక్లోని ఎస్సిబి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్పించారు. ఐదేళ్ల బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. “నిందితుడు జగత్సింగ్పూర్ జిల్లాకు చెందినవాడు. ఇటీవలే జైలు నుండి విడుదలయ్యాడు. అతను అమ్మాయి కుటుంబానికి కూడా తెలుసు, ”అని ఎస్పీ చెప్పారు.
ఈ ఘటనపై 20 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని, రెండు నెలల్లో కోర్టు తీర్పు వెలువడుతుందని, ఈ కేసు రెడ్ ఫ్లాగ్ కేటగిరీ కిందకు వస్తుందని సింగ్ తెలిపారు.
కాగా, ఒడిశాలో ఓ వ్యక్తి ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కనికరం లేకుండా చిన్నారిని ఇష్టం వచ్చినట్లు కొట్టి బలవంతంగా తన వాంఛ తీర్చుకున్నాడు. దాంతో బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణ ఘటన ఆదివారం ఒడిశాలోని పూరీలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని పూరీలో డ్రైవర్గా పనిచేసే మహేశ్ బాధిత బాలిక ఇంటికి తరుచూ వెళ్తుండేవాడు. ఇంట్లో ఎవరూ లేరని గ్రహించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఐదేళ్ల చిన్నారిని పక్కింట్లో ఉండే మహేశ్ మహంతి అనే వ్యక్తి ఇంటిపై డాబా మీదకు తీసుకెళ్లి రేప్ చేశాడు. ఆ చిన్నారి కేకలు వేయడంతో తల్లి మేడ మీదకు వెళ్లింది. దాంతో నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడు.
అత్యాచారానికి గురైన బాలిక తీవ్ర అస్వస్థకు గురైంది. తల్లిదండ్రులు ఆ చిన్నారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి ఆ చిన్నారిని కటక్లోని ఎస్సిబి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో చేర్చారు. ప్రస్తుతం ఆ చిన్నారి చావు బతుకుల మధ్య ఉన్నట్టు సమాచారం. భాదితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడు జగత్సింగ్పూర్ జిల్లాకు చెందినవాడని పోలీసులు తెలిపారు.
నిందితుడు కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు పోలీస్ సూపరింటెండెంట్ కేవీ సింగ్ తెలిపారు. పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. నిందితుడైన మహేశ్ జగత్సింగ్పూర్ జిల్లాకు చెందినవాడని చెప్పారు.