Asianet News TeluguAsianet News Telugu

మల్లికార్జున ఖర్గే.. గాంధీ కుటుంబ విధేయుడు.. కానీ ఇందిరపై తిరుగుబావుట.. !

Mallikarjun Kharge: కర్నాటక నుంచి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన మల్లికార్జున‌ ఖర్గే.. పదే పదే కర్నాటక ముఖ్యమంత్రి పదవిని విస్మరించినప్పటికీ, దశాబ్దాలుగా ఆయన పాత పార్టీకి విధేయుడిగా ఉన్నారు. నేడు కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన ఆయ‌న ఒక‌ప్పుడు ఇందిరా గాంధీపై తిరుగుబాబుట ఎగుర‌వేశారు. 
 

Mallikarjun Kharge.. loyal to Gandhi family.. but revolted against Indira..
Author
First Published Oct 19, 2022, 5:05 PM IST

Congress President: కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు మల్లికార్జున ఖర్గే.. పోటీలో శశి థరూర్‌ను ఓడించి  ఆ పార్టీ సరికొత్త అధ్యక్షుడిగా మారారు. నామినేషన్లు ప్రకటించిన రోజు నుంచే ఆయ‌నే గెలుస్తార‌నే అభిప్రాయాలు ఉన్నాయి. నేడు అధికారికంగా ఆయ‌న కాంగ్రెస్ అధ్య‌క్షులయ్యారు. ఖర్గే గాంధీ కుటుంబం ఆశీర్వాదాలను మాత్రమే కాకుండా, శ‌శి థరూర్‌కు మద్దతుగా ఉన్న తిరుగుబాటు G23 గ్రూపు మద్ద‌తును కూడా పొంద‌గ‌లిగారు. కర్నాటక నుంచి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన ఖర్గే.. సోనియా గాంధీ న‌మ్మ‌క‌మైన వ్య‌క్తి. పదే పదే కర్నాటక ముఖ్యమంత్రి పదవిని విస్మరించినప్పటికీ, దశాబ్దాలుగా ఆయన పాత పార్టీకి విధేయుడిగా ఉన్నారు. కానీ ఆయ‌న కూడా ఒక‌ప్పుడు తిరుగుబాటు చేశారు. ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ఆయన పని చేశారు.

1970వ దశకం చివర్లో అప్పటి కర్ణాటక సీఎం దేవరాజ్ ఉర్స్, ప్రధాని ఇందిరాగాంధీల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఖర్గే తన రాజకీయ గురువుగా భావించిన ఉర్స్.. సంజయ్ గాంధీ రాజకీయాల్లోకి తిరిగి రావడాన్ని వ్యతిరేకించారు. తనను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నాయకులు తమ బాధలను సంజయ్ ద్వారా ఇందిరకు చేరవేస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆ స‌మ‌యంలో ఉర్స్ సీఎం, రాష్ట్ర పార్టీ చీఫ్ పదవులు రెండింటినీ కలిగి ఉన్నాడు. ఆ రెండింటిని వదులుకోవడానికి సిద్ధంగా లేడు. ఆ సమయంలో కర్నాటకలో గుర్తింపు పొందిన నాయ‌కుల‌లో ఒక‌రైన ఉర్సు.. చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మ‌ద్ద‌త‌ను క‌లిగివున్నారు. ఈ క్రమంలోనే ఉర్స్ జనతా పార్టీకి దగ్గరవుతున్నారని అంశాల నేప‌థ్యంలో చివరకు ఇందిర.. ఉర్స్ ను రాష్ట్ర యూనిట్ అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. దీంతో ఉర్సు 1979లో కాంగ్రెస్ (యూ) అనే తన సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. 
 
ఖర్గే తన గురువుకు అండగా నిలిచి, అతనిని అనుసరించి కొత్త రాజ‌కీయ మార్గంలో ముందుకు న‌డిచారు. అయితే కర్నాటకలో ఉర్స్ ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో 1980 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆయన కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చారు. ఖర్గే అప్పటి నుండి కాంగ్రెస్‌కు విధేయుడిగా ఉన్నారు. అలాగే, తన కొడుకులకు రాహుల్, ప్రియాంక్ అని గాంధీ తోబుట్టువుల పేర్లను పెట్టారు. అలాగే, ఆయ‌న కుమార్తెకు ప్రియదర్శిని ఇందిర పేరు పెట్టారు. 

మొదట విద్యార్థి నాయకుడిగా, ఆ తర్వాత కార్మిక సంఘం నాయకుడిగా, న్యాయవాద వృత్తిని అభ్యసించి, చివరకు కాంగ్రెస్‌లోకి ప్రవేశించారు. 1969లో గుల్బర్గా సిటీ యూనిట్ అధ్యక్షుడిగా నియమితులైన ఖర్గే మూడేళ్ల తర్వాత తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అతను గెలిచి ఎనిమిది సార్లు ఫీట్‌ను పునరావృతం చేశాడు. 1976లో ఉర్స్ ప్రభుత్వంలో తొలిసారి మంత్రి అయ్యారు. అనేక సార్లు క‌ర్నాట‌క‌లో సీఎం ప‌ద‌వి వ‌రించిన ఆయ‌న తీసుకోలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయనను మొదట లోక్‌సభలో, ఆపై రాజ్యసభలో నాయకుడిగా నియమించడం ద్వారా కాంగ్రెస్ అతని విధేయతకు ప్రతిఫలమిచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ చీఫ్‌గా, దాదాపు 25 ఏళ్ల తర్వాత ఈ పదవిని చేపట్టిన మొదటి గాంధీయేతర వ్యక్తిగా ఆయన నిలిచారు. అలాగే, జగ్జీవన్ రామ్ (1969) తర్వాత కాంగ్రెస్‌కు నాయకత్వం వహించిన రెండవ దళిత వ్య‌క్తిగా డు ఖర్గే నిలిచారు.

Follow Us:
Download App:
  • android
  • ios