భార్యతో గొడవపడి.. రెండు రోజుల పసికందును నేలకేసి కొట్టిన కసాయి తండ్రి..
మహారాష్ట్రలోని నాగ్పూర్లో తన భార్యతో గొడవపడి తన నవజాత కుమారుడిని ఆసుపత్రిలో నేలకేసి కొట్టిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి ఆదివారం తెలిపారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం నాగ్పూర్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో జరిగింది.
మాయమై పోతున్నడమ్మా.. మనిషన్నవాడు మచ్చుకైనా లేడు సూడు మానవత్వమున్నవాడు అని కవి అందెశ్రీ ఏ సందర్భంలో రాశారో తెలీదు కానీ.. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన హృదయాన్ని కలచి వేసేలా ఘటనకు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. వాస్తవంగా మానవ సంబంధాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. అనుమానం పెనుభూతంగా మారి పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతుంది. ఓ వ్యక్తి తన భార్యపై అనుమానం పెంచుకుని.. దారుణానికి ఒడిగట్టాడు. తన భార్యతో గొడవపడి తన రెండు రోజుల పసికందును నేలకేసి కొట్టాడు ఆ కసాయి తండ్రి.
ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో చోటుచేసుకుంది. భార్యతో గొడవపడి తన పసికందుని ఓ తండ్రి నేలకేసి కొట్టిన ఘటన శనివారం సాయంత్రం నాగ్పూర్లోని ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రిలో జరిగింది. దారుణానికి ఒడిగట్టిన దుర్మాగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పసికందుకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నట్టు, ఆ చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
అమరావతి నివాసి అయిన నిందితుడికి 2020లో వివాహం జరిగింది. అయితే..ఆ వ్యక్తి తన భార్యను మొదటి నుంచే అనుమానించేవాడు. అయితే.. గతనెల డిసెంబరు 30న వారికి కొడుకు పుట్టారు. ఆ చిన్నారిని చూడటానికి నాగ్పూర్లోని ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రికి వచ్చారు. ఈ క్రమంలో తన భార్యతో గొడవ పడ్డాడు.వారి మధ్య మాట మాట పెరిగి.. తీవ్ర వాగ్విదానికి దారి తీసింది.
ఆస్పత్రిలో గొడవపెడుతుండగా అక్కడున్న సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన ఆ వ్యక్తి పసికందును నేలపై విసిరేశాడు. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది నిందితుడిని బంధించి.. పోలీసులకు అప్పగించారు. పసికందుకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చిక్సిత అందిస్తున్నారనీ, ఆ చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని అజ్ని పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. నిందితుడిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.