మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదం: 'దమ్ముంటే బెలగావిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించండి..'
Mumbai: మహారాష్ట్ర-కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం ముదురుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని షోలాపూర్లో కర్ణాటక బస్సులు, సీఎం బసవరాజ్ బొమ్మై ఫోటోలపై నల్ల ఇంకును, మట్టిని చల్లారు. భాషా పరంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తర్వాత సరిహద్దు సమస్య 1957 తర్వాత మళ్లీ ఇప్పుడు ఉద్రిక్తపరిస్థితులను ఏర్పర్చింది.
Karnataka-Maharashtra border dispute: కర్నాటక-మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం మరింతగా ముదురుతోంది. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య ఉద్రిక్తపరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ వివాదం కాస్త కోర్టు మెట్లు ఎక్కగా, రెండు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి. మహారాష్ట్ర-కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం ముదురుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని షోలాపూర్లో కర్ణాటక బస్సులు, సీఎం బసవరాజ్ బొమ్మై ఫోటోలపై నల్ల ఇంకును, మట్టిని చల్లారు. భాషా పరంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తర్వాత సరిహద్దు సమస్య 1957 తర్వాత మళ్లీ ఇప్పుడు ఉద్రిక్తపరిస్థితులను ఏర్పర్చింది. మరాఠీ మాట్లాడే జనాభా ఎక్కువగా ఉన్నందున, మునుపటి బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమైన బెలగావిపై మహారాష్ట్ర దావా వేసింది. ఇది ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రంలో భాగమైన 814 మరాఠీ మాట్లాడే గ్రామాలపై దావా వేసింది. అయితే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1967 మహాజన్ కమీషన్ నివేదిక ప్రకారం భాషా ప్రాతిపదికన చేసిన విభజనను కర్ణాటక అంతిమంగా పరిగణిస్తుంది.
పోలిటికల్ టర్న్ తీసుకున్న ఈ వివాదం ప్రస్తుతం రెండు రాష్ట్రాల పొలిటికల్ హీట్ ను పెంచింది. ఈ క్రమంలోనే శివసేన నాయకుడు సంజయ్ రౌత్ స్పందిస్తూ.. మహారాష్ట్ర ఏక్ నాథ్ షింగే సర్కారు, కేంద్రలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బెళగావిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) నాయకుడు సంజయ్ రౌత్ డిమాండ్ చేయడంతో కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం బుధవారం మరింత పెరిగింది. గత కొన్ని రోజులుగా బెలగావిలో హింసాత్మక సంఘటనలు ఢిల్లీ (కేంద్రంలోని బీజేపీ సర్కారు) మద్దతు లేకుండా జరిగేవి కావని ఆయన ఆరోపించారు.
"ఏం జరుగుతోందో మాకు తెలియదా? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది.. కర్ణాటకలో, మహారాష్ట్రలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది. సీఎం ఏక్ నాథ్ షిండేకు దమ్ము ఉంటే బెళగావిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని" పిలుపునిచ్చారు. బెలగావిలో మంగళవారం మహారాష్ట్ర నంబర్ ప్లేట్లు ఉన్న ట్రక్కులపై దాడి చేసి నల్ల పెయింట్ తో పిచికారీ చేశారు. మహారాష్ట్ర బస్సులపై కూడా రాళ్లు రువ్వారు. అనంతరం కర్ణాటక రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సులను ధ్వంసం చేశారు. ఉద్రిక్తతలు పెరగడంతో, చాలా మందిని అదుపులోకి తీసుకోవలసి వచ్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేపై సంజయ్ రౌత్ తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు. ఢిల్లీ మద్దతు లేకుండా మహారాష్ట్రలోని మరాఠీ ప్రజలు, వాహనాలపై బెల్గాంలో దాడి చేయడం సాధ్యం కాదని రౌత్ ట్వీట్ చేశారు. మహారాష్ట్ర ఎకికరణ్ సమితి కార్యకర్తలను అరెస్టు చేశారు. వెన్నెముకను విచ్ఛిన్నం చేయడం ద్వారా మరాఠీ ఆత్మగౌరవాన్ని ముగించే ఆట ప్రారంభమైంది. బెల్గాంలో జరిగిన దాడులు కూడా ఇదే కుట్రలో భాగమని కేంద్ర, రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.