భార్యతో విడిపోవాలని కేసు: బిడ్డను కనేందుకు కోర్టుకెక్కిన భార్య
విడాకులు కావాలని కోరిన భర్తతోనే తనకు రెండో బిడ్డను కనేందుకు అనుమతి ఇవ్వాలని ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. ఈ నెల 24వ తేదీన మ్యారేజీ కౌన్సిలర్తో సమావేశం కావాలని దంపతులకు కోర్టు సూచించింది.
ముంబై: విడాకులు కావాలని కోరిన భర్తతోనే తనకు రెండో బిడ్డను కనేందుకు అనుమతి ఇవ్వాలని ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. ఈ నెల 24వ తేదీన మ్యారేజీ కౌన్సిలర్తో సమావేశం కావాలని దంపతులకు కోర్టు సూచించింది.
35 ఏళ్ల వివాహిత విడాకులు కోరుతున్న భర్తతో రెండో బిడ్డను కనాలని కోరుతోంది. 2017లో తన భార్య నుండి విడాకులు కావాలని ముంబై కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్పై విచారణ జరుగుతోంది.అయితే ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో వివాహిత 2018లో వివాహిత నాందేడ్ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తనకు రెండో బిడ్డను కనేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది.
ఈ కేసు విషయమై విచారణ సాగింది. తమ దాంపత్య హక్కులను పునరుద్దరించడం ద్వారా కానీ, కృత్రిమ పద్దతిలో కానీ బిడ్డను కనేందుకు అనుమతి ఇవ్వాలని కుటుంబ న్యాయస్థానాన్ని కోరారు.
ఈ అభ్యర్థనను కుటుంబ న్యాయస్థానం పరిశీలించింది. సంతానోత్పత్తి హక్కులు భావోద్వేగపరంగా చర్చించదగినవి కోర్టు అభిప్రాయపడింది. స్త్రీ, పురుష సంక్షిష్టతతో కూడినవని, న్యాయపరమైన, సాంఘికపరమైన చిక్కులను సృష్టించగలవని జడ్జి పేర్కొన్నారు.
సంతానోత్పత్తి హక్కు మహిళకు ఉందని ఆ హక్కును ఆమె వినియోగించుకోవచ్చునని మాత్రమే చెప్పగలమన్నారు. ప్రస్తుత కేసులో మహిళ తన భర్తను కృత్రిమ గర్భాదానం కోసం వీర్యాన్ని దానం చేయాలని అభ్యర్థన సంతానోత్పత్తి కోసం ఆమె ఎంపిక చేసుకొన్న న్యాయమైన విధానమన్నారు.
ఈ విషయంలో ఈ జంట రీప్రొడక్టివ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్ను సంప్రదించాలని తెలిపారు. అయితే దీని కోసం భర్త సమ్మతి చాలా ముఖ్యమన్నారు. ఈ నెల 24న మ్యారేజీ కౌన్సిలర్తో సమావేశం కావాలన్నారు. ఓ నెలలోగా ఐవీఎఫ్ ఎక్స్ఫర్ట్ను సలహాను అడగాలని కోర్టు తెలిపింది.
స