ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది మృతి
ఎదురెదురుగా వస్తున్నా కారు, లారీ ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 9మంది ప్రాణాలు కోల్పోయారు.
మహారాష్ట్రలోని పూణే-సోలాపూర్ హైవే పై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్నా కారు, లారీ ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 9మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు పూణేకు సమీపంలోని యావత్ గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన మృతుల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతులంతా కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు.లారీ అతివేగంగా రావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు.
Maharashtra: 9 people, in a car, died in a collision with a truck on Pune-Solapur highway near Kadamwak Wasti village in Pune, late last night. All the deceased were residents of Yavat village of Pune. pic.twitter.com/CVihgprc92
— ANI (@ANI) July 19, 2019