Asianet News TeluguAsianet News Telugu

మహారాష్ట్ర సంక్షోభం: వాదనలు పూర్తి తీర్పు రేపు ఉదయానికి వాయిదా

మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్‌ ముఖ్యమంత్రిగా, అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వాన్ని సవాల్‌ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ శనివారం సాయంత్రం సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశాయి. సుప్రీమ్ వాదనలు పూర్తిగా విన్న తరువాత తీర్పును రేపటికి వాయిదా వేసింది. రేపు ఉదయం 10.30కు తీర్పును వెలువరించనున్నట్టు తెలిపింది. 

Maha Crisis: supreme court reserved its verdict for tomorrow
Author
New Delhi, First Published Nov 25, 2019, 11:56 AM IST

న్యూ ఢిల్లీ: మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్‌ ముఖ్యమంత్రిగా, అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వాన్ని సవాల్‌ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ శనివారం సాయంత్రం సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశాయి. దీన్ని అత్యవసరంగా విచారణ జరపవలిసిన పిటిషన్ గా సుప్రీమ్ దీన్ని పరిగణించింది. దీనిపై నిన్నసుప్రీమ్ విచారణ జరిపి నేటికీ వాయిదా వేసింది. 

సుప్రీమ్ వాదనలు పూర్తిగా విన్న తరువాత తీర్పును రేపటికి వాయిదా వేసింది. రేపు ఉదయం 10.30కు తీర్పును వెలువరించనున్నట్టు తెలిపింది. 

గవర్నర్ లేఖను, ఎన్సీపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతూ గవర్నర్ కు ఇచ్చిన లేఖను సుప్రీమ్ కోర్టుకు సమర్పించాలని ఎస్జీని సుప్రీమ్ కోర్ట్ ఆదేశించించింది. నేటి ఉదయం 10.30కు ఈ కేసును తిరిగి సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.  

కోర్టుకి వచ్చిన సొలిసిటర్ జనరల్ కోర్టు అడిగిన రెండు లేఖల ఒరిజినల్ కాపీలు తన వద్ద ఉన్నాయని అన్నారు. కోర్టుకు ఆ రెండు లేఖలు సమర్పించిన తరువాత మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులను, రాష్ట్రపతి పాలనకు దారితీసిన కారణాలను తెలిపారు. 

సొలిసిటర్ జనరల్ సమర్పించిన లేఖలు మరాఠీలో ఉన్నాయని వాటితోపాటు ఇంగ్లీష్ తర్జుమాను కూడా సర్పించాడు. దేవేంద్ర ఫడ్నవిస్ తరుపున వాదనలు వినిపిస్తున్న ముకుల్ రోహత్గి వాదిస్తూ, శివసేన మోసం చేసింది కాబట్టి ఎన్సీపీ ఇచ్చిన లేఖతో ఫడ్నవీస్ ముందుకెళ్లారని చెప్పారు. గవర్నర్ రాజ్యరంగా బద్దంగానే వ్యవహరించారని అన్నారు.

ఎన్సీపీ ఎమ్మెల్యేలు సంతకం పెట్టిన లేఖకు మరో పత్రం జతచేసి ఫడ్నవిస్ కు మద్దతు తెలుపుతున్నట్టుగా అజిత్ పవార్ మార్చారని ఎన్సీపీ తరుపున వాదనలు వినిపించిన లాయర్ అంటున్నారు.  

సొలిసిటర్ జనరల్ 2-3 రోజుల సమయం కావాలని అడిగినా జస్టిస్ ఖన్నా మాత్రం గతంలో 24గంటల్లో బలనిరూపణ జరిగిందని, ప్రస్తుత పరిస్థితి ఎందుకు దానితో భిన్నమని కోర్టు ప్రశ్నించింది. 

ఇక లోక్ సభలో మహారాష్ట్ర విషయమై గందరగోళం నెలకొంది. కాంగ్రెస్, కొన్ని ఇతర ప్రతిపక్షాలు వాక్ అవుట్ చేసి ఆందోళనకు దిగాయి. లోక్ సభలో నెలకొన్న గందరగోళంతో మధ్యాహ్నం వరకు సభ వాయిదాపడింది. 

ఎన్సీపీ తరుఫున వాదనలు వినిపిస్తున్న లాయర్ తమకు 53 మంది సభ్యుల మద్దతు ఉందని వాదించారు. కపిల్ సిబాల్ ఎన్సీపీ తరుఫున వాదనలు వినిపిస్తూ, జాకీ పారిపోయాడని, గుర్రాలు మాత్రం ఎన్సీపీలోనే ఉన్నాయని వాదించారు. ఈ విషయం చెప్పగానే కోర్టులో నవ్వులు పూశాయి. 

సుప్రీమ్ కోర్టుకు బలనిరూపణ ఎప్పుడు నిర్వహించాలని ఆదేశించే అధికారం లేదని ఫడ్నవీస్ తరుపున వాదనలు వినిపిస్తున్న ముకుల్ రోహత్గి వాదించారు. వెంటనే కపిల్ సిబాల్ 154 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లు ఉన్నట్టు తెలిపారు. 51 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు, 56 మంది శివసేన, ఇద్దరు సమాజ్ వాదీ ఎమ్మెల్యేలు, 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల అఫిడవిట్లున్నట్టు చెప్పారు. 

అఫిడవిట్లను కోర్టుకు సమర్పించారు. అత్యవసరంగా బలనిరూపణ జరపాలని, దాన్ని వీడియో రికార్డు చేయాలనీ, అత్యంత సీనియర్ మెంబెర్ ని ప్రొటెం స్పీకర్ గా నియమించాలని సిబాల్ కోరారు. అర్థరాత్రిపూట ఎందుకు ఇలా రాష్ట్రపతి పాలన ఎత్తేయాల్సోచ్చిందని, రహస్యంగా తెల్లవారుజామున ప్రమాణస్వీకారం చేయవల్సిన అవసరం ఏమొచ్చిందని అన్నారు. 

ఎన్సీపీ తరుపున వాదనలు వినిపిస్తున్న అభిషేక్ మను సింఘ్వి, ఈ ఎన్సీపీ ఎమ్మెల్యేల సంతకం కేవలం అజిత్ పవార్ ను తమ నాయకుడిని ఎన్నుకోవడానికి పెట్టారు తప్ప, బీజేపీకి మద్దతు తెలపడానికి కాదని వాదించారు. 

అజిత్ పవార్ ని లెజిస్లేటివ్ పార్టీ చీఫ్ గా తొలగించినట్టు కోర్టుకు తెలిపాడు. నేడు లేదా రేపు బాల నిరూపణకు ఆదేశించాలని కోర్టుకు అభిషేక్ మను సింఘ్వి విన్నవించారు. ఇరు వర్గాలు బల నిరూపణకు ఒప్పుకుంటే, ఎందుకు అఫిడవిట్ల కోసం ఆగాలని అన్నాడు. మొదటగా బల నిరూపణ మాత్రమే జరపాలని, ఆతరువాత మాత్రమే స్పీకర్ ఎన్నిక ఉండాలని అన్నారు. తొలుత ప్రొటెం స్పీకర్ ఎన్నిక, ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ఆ తరువాత బల నిరూపణ అంతే అజెండాగా ఉండాలని అన్నారు. 

Also read: మహా'క్యాంపు' : రిసార్ట్ రాజకీయాలకు తెరతీసిన పార్టీలు

నిన్న,కోర్ట్ తీర్పు కోసం వాదనలు వినడానికి అరగంట ముందుగానే, కోర్ట్ రూమ్ పూర్తిగా కిక్కిరిసి పోయింది. కేంద్రం తరుఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తుండగా, కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీల తరుఫున అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. కర్ణాటకలో ఏర్పడ్డ యెడ్డీ సర్కారుకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ తరుఫున  అప్పుడు కూడా అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. 

కపిల్ సిబాల్ వాదనలు వినిపిస్తూ, కర్ణాటక జడ్జిమెంట్ ను గుర్తు చేసారు. బీజేపీకి గనుక మెజారిటీ ఉంటె వెంటనే బలనిరూపణకు వెళ్లాలని సుప్రీమ్ కోర్టుకు విన్నవించారు. కర్ణాటకలో మాదిరిగా వీడియో రికార్డింగ్ జరపాలని, మూజువాణి ఓటుతో కాకుండా, సీక్రెట్ బాలట్ తో కాకుండా బాల నిరూపణ అసెంబ్లీలో జరగాలని అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. 

Also read: మహారాష్ట్రలో అసలు ఎం జరుగుతుంది? శరద్ పవార్ తో బీజేపీ ఎంపీ భేటీ

దానికి పూర్వం, ప్రభుత్వం తరుపున వాదనలు వినిపిస్తూ ఎస్జీ హై కోర్టుకు ఈ కేసును బదిలీ చేయమని కోరగా, సుప్రీమ్ కోర్ట్ ఆ వాదనను తోసిపుచ్చింది. అంతేకాకుండా గవర్నర్ చర్యలను ప్రశ్నించలేమని ప్రభుత్వం తన వాదనలు వినిపించగా జడ్జీలు మాత్రం ఆ విషయాల గురించి ఇప్పుడు చర్చలు అవసరం లేదని, అవన్నీ ముగిసిపోయిన అంశాలని, కేవలం  

జస్టిస్ రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం దీనిపై విచారణ జరపనుంది. ఈ రిట్ పిటిషన్ లో ఫడ్నవీస్ కు బాల నిరూపణ కోసం ఇచ్చిన వారం రోజుల గడువును కూడా సవాల్ చేసారు. వారం పాటు గడువు ఇస్తే ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపే ఆస్కారం ఉంటుందని, అది రాజ్యంగా విరుద్ధమని వారు ఆ సదరు పిటిషన్ లో కోరారు. 

అక్టోబర్‌ 24న వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏపార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని సంగతి తెలిసిందే. అయితే, బీజేపీ-శివసేన దోస్తీ తెగదెంపులు కావడంతో.. కాంగ్రెస్‌, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన అంతా రెడీ చేసుకున్న టైములో వారికి ఊహించని షాక్‌ తగిలింది. 

ఎన్సీపీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌ మద్దతుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభ పక్షనేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రమాణ స్వీకారం చేశారు.  డిప్యూటీ సీఎంగా శరద్ పవార్ అన్నకొడుకు అజిత్‌ పవార్‌ ప్రమాణం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios