తమిళనాడులో దారుణం: ఆశ్రమంలో ఉన్న చిన్నారి విక్రయం, మరో 16 మంది అదృశ్యం
తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో ఇదయం ట్రస్ట్లో దారుణం చోటు చేసుకొంది. ఈ ఆశ్రమంలోని పిల్లలు అదృశ్యమయ్యారు. ఈ అదృశ్యం వెనుక భారీ ముఠా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
చెన్నై : తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో ఇదయం ట్రస్ట్లో దారుణం చోటు చేసుకొంది. ఈ ఆశ్రమంలోని పిల్లలు అదృశ్యమయ్యారు. ఈ అదృశ్యం వెనుక భారీ ముఠా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.ఈ ట్రస్టులో ఉంటున్న తన కొడుకును చూసేందుకు ఓ తల్లి ఇటీవలనే ఆశ్రమానికి వచ్చింది. అయితే కరోనాతో ఆ బాలుడు చనిపోయాడని తల్లిదండ్రులకు ట్రస్ట్ నిర్వాహకులు చెప్పారు. అయితే వారం రోజుల క్రితమే ఆ పిల్లాడిని ట్రస్టు నిర్వాహకులు రూ. 5 లక్షలకు విక్రయించారు.
ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు అందడంతో విచారణ చేపట్టారు.ఈ విచారణలో ట్రస్టు నుండి పెద్ద ఎత్తున పిల్లలు మాయమయ్యారనే విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు 16కి పైగా పిల్లలు అదృశ్యమయ్యారని గుర్తించారు. ఈ పిల్లల అదృశ్యానికి సంబంధించి సరైన సమాచారాన్ని ట్రస్ట్ నిర్వాహకులు ఇవ్వలేదు. ట్రస్టు నిర్వాహకులు రెండు మూడు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఆశ్రమం నుండి పిల్లల అదృశ్యం వెనుక ఏదైనా ముఠా హఃస్తం ఉందా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు.