Asianet News TeluguAsianet News Telugu

తమిళనాడులో దారుణం: ఆశ్రమంలో ఉన్న చిన్నారి విక్రయం, మరో 16 మంది అదృశ్యం

తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో ఇదయం ట్రస్ట్‌లో దారుణం చోటు చేసుకొంది. ఈ ఆశ్రమంలోని  పిల్లలు అదృశ్యమయ్యారు.  ఈ అదృశ్యం వెనుక భారీ ముఠా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Madurai NGO Sells Off 1-year-old Baby, Director Absconding, Police Seal Building  lns
Author
Tamilnadu, First Published Jul 2, 2021, 9:33 AM IST

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో ఇదయం ట్రస్ట్‌లో దారుణం చోటు చేసుకొంది. ఈ ఆశ్రమంలోని  పిల్లలు అదృశ్యమయ్యారు.  ఈ అదృశ్యం వెనుక భారీ ముఠా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.ఈ ట్రస్టులో ఉంటున్న తన కొడుకును చూసేందుకు ఓ తల్లి ఇటీవలనే ఆశ్రమానికి వచ్చింది. అయితే  కరోనాతో ఆ బాలుడు చనిపోయాడని తల్లిదండ్రులకు ట్రస్ట్ నిర్వాహకులు చెప్పారు.  అయితే వారం రోజుల క్రితమే ఆ పిల్లాడిని ట్రస్టు నిర్వాహకులు రూ. 5 లక్షలకు విక్రయించారు.

ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు అందడంతో విచారణ చేపట్టారు.ఈ విచారణలో ట్రస్టు నుండి పెద్ద ఎత్తున పిల్లలు మాయమయ్యారనే విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు 16కి పైగా  పిల్లలు అదృశ్యమయ్యారని గుర్తించారు. ఈ పిల్లల అదృశ్యానికి సంబంధించి సరైన సమాచారాన్ని ట్రస్ట్ నిర్వాహకులు ఇవ్వలేదు.  ట్రస్టు నిర్వాహకులు రెండు మూడు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఆశ్రమం  నుండి పిల్లల అదృశ్యం వెనుక ఏదైనా ముఠా హఃస్తం ఉందా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios