నెత్తురోడిన రహదారులు..బస్సు కోసం నిరీక్షణ.. అంతలోనే దూసుకొచ్చిన మృత్యువు.. ఆరుగురు దుర్మరణం
మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. జిల్లాలోని సత్రుండ గ్రామ సమీపంలోని రత్లాం – ఇండోర్ ఫోర్లైన్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ట్రక్కు ఒక్కసారిగా టైరు పగలిపోవడంతో అదుపు తప్పి అక్కడే బస్సు కోసం వెయిట్ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలవగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు
మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రత్లాం జిల్లాలోని సత్రంద మాత దేవాలయం సమీపంలో చోటుచేసుకుంది. అత్యంత వేగం వెళ్తున్న ట్రక్కు టైరు పగిలిపోవడంతో అదుపు తప్పి అక్కడే బస్సు కోసం నిరీక్షిస్తున్న వారిపైకి దూసుకెళ్లింది.
దీంతో రోడ్డుపై వెళ్తున్న పాదచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనలో 6 అక్కడిక్కడే చనిపోగా.. గాయపడిన 11 మందిని చికిత్స కోసం ఆసుపత్రిలో తరలించారు.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదం రత్లాం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రత్లాం-లేబర్ ఫోర్లేన్లోని సతరుండా గ్రామ సమీపంలో పెను ప్రమాదం జరిగినట్లు డీఎం తెలిపారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రి నుంచి వైద్య కళాశాలకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే కలెక్టర్ నరేంద్ర కుమార్ సూర్యవంశీ, పోలీసు సూపరింటెండెంట్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం అనంతరం అక్కడ రక్తపు మరకలతో, చెల్లాచెదురైనా మృతదేహాలతో మొత్తం భీతావహంగా మారింది. ప్రమాదం అనంతరం డ్రైవర్ టక్కును వదిలి పరారయ్యాడు.
సీఎం సంతాపం..
ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఇండోర్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కార్యక్రమానికి హాజరైన రత్లాం రూరల్ ఎమ్మెల్యే దిలీప్ మక్వానా ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి బయలుదేరారు. కలెక్టర్తోపాటు ఉన్నతాధికారులతో ఫోన్లో చర్చించి సహాయక చర్యలు వెంటనే ప్రారంభించాలని కోరారు.
మహారాష్ట్రలో బస్సును ఢీ కొట్టిన వ్యాన్..
మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం నాడు రాష్ట్ర రవాణా బస్సుపైకి పికప్ వ్యాన్ దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మరణించారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. నెర్ టౌన్ నుంచి అమరావతికి వెళ్లే రహదారిలో ఉదయం 10.25 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు యవత్మాల్ పోలీస్ సూపరింటెండెంట్ పవన్ బన్సోడే తెలిపారు. ఏడుగురు ప్రయాణికులతో యవత్మాల్ నుంచి అమరావతికి వెళ్తున్న పికప్ వ్యాన్ ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టిందని ఆయన తెలిపారు.చ
వ్యాన్లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని అధికారి తెలిపారు. బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
తెలంగాణలోని ఎన్హెచ్ 44లోని పెద్దాస్పూర్ గ్రామంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ర్యాష్ డ్రైవింగ్, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని శంషాద్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎ శ్రీధర్ కుమార్ తెలిపారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.
లోయలో పడ్డ పికప్ ట్రక్కు .. నలుగురు మృతి
దక్షిణ మిజోరాంలోని లుంగ్లీ జిల్లాలో పెను రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం నాడు పికప్ ట్రక్ లోయలో పడిపోవడంతో 11 ఏళ్ల బాలుడితో సహా కనీసం నలుగురు వ్యక్తులు మరణించారు. నలుగురు ప్రయాణికులు ఐజ్వాల్ నుండి తమ గ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. వారు ప్రయాణిస్తున్న పికప్ ట్రక్ థింగ్ఫాల్ గ్రామ శివార్లలోని 200 మీటర్ల లోతులో ఉన్న లోయలో పడిపోయింది.