Asianet News TeluguAsianet News Telugu

కొడుకు లేని టైం చూసి.. కోడలి గదిలో దూరి మామ అఘాయిత్యం...

ఇదిలా ఉండగా ఒకరోజు  రాజు పనిమీద రాజధాని భోపాల్ వెళ్ళాడు.  ఆ రోజు రాత్రి  సుకన్య తన గదిలో ఒంటరిగా నిద్రపోతుంది.అర్ధరాత్రి సమయంలో  ఒక్కసారి సడెన్ గా మెలుకువ వచ్చింది. ఆ శబ్దం ఏమిటా అని చూస్తే.. ఎవరో మగ మనిషి గదిలో కనిపించాడు. వెంటనే భయంతో లేచి చూస్తే తన father-in-law చటేశ్వర్ ఆమె గదిలో ఉన్నాడు. 

Madhya Pradesh: Man rapes his daughter-in-law in Gwalior
Author
Hyderabad, First Published Nov 3, 2021, 9:44 AM IST

మధ్యప్రదేశ్ : స్త్రీలపై అత్యాచారాల కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వయసు తేడా లేకుండా, వావివరసలు మరిచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇక ఇలాంటి కేసులలో ఎక్కువ శాతం బాధితులకు పరిచయమున్నవారే ఉండడం గమనార్హం. అందుకే దగ్గరి పరిచయస్తులు, బంధువులు, స్నేహితులు.. చివరికి కన్నతండ్రిని కూడా నమ్మే పరిస్థితి లేదు. ప్రస్తుతం అలాంటి ఘటన గ్వాలియర్ లో జరిగింది. 

గ్వాలియర్ కు చెందిన సుకన్య (22) (పేరు మార్చబడినది)కు అదే నగరానికి చెందిన రాజు (27)తో  2018 లో వివాహం జరిగింది.  వివాహం జరిగిన రెండు సంవత్సరాల తర్వాత రాజు తల్లి మరణించింది.  ప్రస్తుతం సుకన్య,  తన భర్త రాజుతో పాటు మామయ్య చటేశ్వర్ తో కలిసి ఒకే ఇంట్లో ఉంటుంది.  గత కొద్ది కాలంగా సుకన్య,   రాజుల మధ్య conflictsలు జరుగుతూ ఉన్నాయి.

ఇదిలా ఉండగా ఒకరోజు  రాజు పనిమీద రాజధాని భోపాల్ వెళ్ళాడు.  ఆ రోజు రాత్రి  సుకన్య తన గదిలో ఒంటరిగా నిద్రపోతుంది.అర్ధరాత్రి సమయంలో  ఒక్కసారి సడెన్ గా మెలుకువ వచ్చింది.  ఎందుకు మెలుకువ వచ్చిందో అర్థం కాక.. చుట్టూ గమనిస్తే.. గదిలో ఏదో అలికిడి శబ్దానికి సుకన్య నిద్ర లేచిందని అర్థమయ్యింది. 

ఆ శబ్దం ఏమిటా అని చూస్తే.. ఎవరో మగ మనిషి గదిలో కనిపించాడు. వెంటనే భయంతో లేచి చూస్తే తన father-in-law చటేశ్వర్ ఆమె గదిలో ఉన్నాడు. సుకన్య కంగారుగా లేచి ఏం కావాలి? ఎందుకు వచ్చారు? అని అడిగింది.

అప్పుడు చటేశ్వర్ విచిత్రంగా ప్రవర్తించాడు. కూతురు వరుస అయ్యే కోడలితో చాలా అసభ్యంగా మాట్లాడాడు. అంతేకాదు...తన కోరికలను తీర్చమంటూ వేధించాడు. భార్య లేక తను ఒంటరి వాడినై పోయానని… కోరికలతో నలిగి పోతున్నానని... అందుకు ఆమె వద్దకు వచ్చానని చటేశ్వర్ అన్నాడు.

ఇది విన్న సుకన్య షాక్ కు గురైంది. ముందు తనగది నుంచి బయటకు వెళ్ళమని అతనితో చెప్పింది. కానీ చటేశ్వర్ ఆమె మాటలను పట్టించుకోలేదు. తాను ఎంత చెప్పినా వినక పోవడంతో.. చటేశ్వర్ ఆమెపై బల ప్రయోగం చేశాడు. 

‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’.. కెప్టెన్ అమరీంద్ సింగ్ కొత్త పార్టీ పేరు.. కాంగ్రెస్‌కు రిజైన్

ఆమెను లొంగదీసుకోవడానికి చితకబాదాడు. ఆమెపై rape చేసి ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని భయపెట్టాడు. మరుసటి రోజు ఉదయం సుకన్య సమయం చూసి తన పుట్టింటికి పారిపోయింది.

అక్కడ తన తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పింది. విషయం విని షాక్ కు గురైన తల్లిదండ్రులు.. ఆ తరువాత ఆమెను వెంటపెట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడ జరిగిందంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే అంతా విన్నా policeలు... చటేశ్వర్ ను అరెస్ట్ చేయలేదు. ముందు ఈ కేసు విషక్ష్ంలో విచారణ చేసిన తరువాతే తగిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios