Asianet News TeluguAsianet News Telugu

ఘోర ప్రమాదం.. ఐదుగురి మృతి

వేగంగా వెళుతున్న ఓ కారు రోడ్డు పక్కనే నిలిపి ఉన్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు  అయ్యాయి.
 

Madhya Pradesh: Five of family killed in road accident
Author
Hyderabad, First Published Dec 22, 2020, 8:11 AM IST


మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  మధ్యప్రదేశ్ లోని సియోని జిలాలో సోమవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న ఓ కారు రోడ్డు పక్కనే నిలిపి ఉన్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు  అయ్యాయి.

దీంతో గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతి చెందిన వారు ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు పేర్కొ‍న్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios