ఉజ్జయినిలో రాహుల్ గాంధీని చంపేస్తానంటూ బెదిరించిన వ్యక్తి అరెస్ట్
Ujjain: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ కు చేరుకోగానే ఆయనను చంపేస్తానంటూ బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర లో భారత్ జోడో యాత్ర ముగిసిన తర్వాత.. మధ్యప్రదేశ్ లోకి ప్రవేశించగానే రాహుల్ గాంధీని చంపేస్తానంటూ గతవారం ఒక వ్యక్తి బెదిరింపు లేఖలను పంపాడు.
Congress leader Rahul Gandhi: దేశవ్యాప్త కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీని మధ్యప్రదేశ్ లోకి ప్రవేశించిన వెంటనే చంపేస్తానంటూ బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ లోకి ప్రవేశించిన వెంటనే రాహుల్ గాంధీపై బాంబులు వేసి చంపేస్తానంటూ గతవారం ఒక వ్యక్తి లేఖలతో బెదిరించాడు. అప్రమత్తమైన పోలీసులు గురువారం ఆ వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకెళ్తే.. రాహుల్ గాంధీని చంపుతానని బెదిరిస్తూ లేఖ రాసిన వ్యక్తిని మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని దయా అలియాస్ ప్యారే అలియాస్ నరేంద్ర సింగ్గా గుర్తించారు. ఉజ్జయిని జిల్లాలోని నగ్డా ప్రాంతంలో అతడిని అరెస్టు చేసి ఇండోర్ పోలీసులకు అప్పగించారు. రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర కోసం ఇండోర్కు రాగానే బాంబు పేలుస్తానని బెదిరిస్తూ లేఖ రాశారని ఆరోపించారు. రాహుల్ గాంధీని చంపేస్తానంటూ బెదిరింపుల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు కనీసం 200 సీసీటీవీలను తనిఖీ చేశారు.. అరడజను నగరాల్లోని హోటళ్లు, లాడ్జీలు, రైల్వే స్టేషన్లపై దాడులు చేశారు. ఈ క్రమంలోనే నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు.
నిందితుడు ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీకి చెందినవాడని పోలీసులు తెలిపారు. గతంలో కూడా అతను లేఖలు, ఫోన్ కాల్స్ ద్వారా పలువురిని బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు ఇండోర్లోని ఖల్సా స్టేడియంలో కాంగ్రెస్ ఈవెంట్ కోసం హాజరయ్యాడు, అక్కడ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కూడా ఉన్నారు.
కాగా, కాంగ్రెస్ చేపట్టిన దేశవ్యాప్త భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో కొనసాగుతోంది. దేశ ప్రజలను ఏకం చేయడమే లక్ష్యంగా భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ చేపట్టారని కాంగ్రెస్ పార్టీ ఇదివరకు పేర్కొంది. మధ్యప్రదేశ్ లో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారతదేశంలో బీజేపీ ద్వేషం, భయం, హింసాత్మక వాతావరణాన్ని సృష్టించిందని రాహుల్ గాంధీ అన్నారు.
"మేము పార్లమెంట్లో గొంతు పెంచడానికి ప్రయత్నించినప్పుడు, మా మైక్ ఆగిపోయింది. పత్రికా రంగానికి చెందిన వారు నాకు స్నేహితులని, అయితే వారు నా మాట వినడం లేదని, వారిపై కూడా ఒత్తిడి ఉంది. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో మేం గెలిచాం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. స్వరం పెంచడానికి అన్ని ప్రజాస్వామ్య పద్ధతులను నిలిపివేశారు. మేము ఒకే ఒక మార్గం మిగిలి ఉంది, నేరుగా రోడ్డుపైకి వెళ్లి ప్రజలతో నేరుగా కనెక్ట్ అవ్వడం.. అందుకే ప్రజల్లోకి వస్తున్నాం.. వారి సమస్యల కోసం పోరాటం సాగిస్తాం" అని రాహుల్ గాంధీ అన్నారు.